Anant Ambani Wedding: ఫ్యామిలీ ఫొటోలో ఐశ్వర్య ఎక్కడ? అంబానీ కొడుకు పెళ్లిలో ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Anant Radhika Wedding-Aishwarya Rai Miss From Family Photo: అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

Anant Radhika Wedding-Aishwarya Rai Miss From Family Photo: అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమకు చెందిన వారితో పాటుగా రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో సెలబ్రిటీలు తీన్మార్‌ డ్యాన్స్‌తో దుమ్ము లేపారు. ఈ పెళ్లికి బాలీవుడ్‌ నుంచి సూపర్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌, కరణ్‌ జోహార్‌ వంటి బడా సెలబ్రిటీలంతా హజరయ్యారు. ఇక సౌత్‌ నుంచి రజనీకాంత్‌, నాగార్జున, వెంకటేష్‌, సూర్య దంపతులు, నయన్‌ కపుల్‌ అంబానీ పెళ్లిలో సందడి చేశారు.

ముంబైలో శుక్రవారం అనగా జూలై 12న సాయంత్రం జరిగిన అనంత్‌-రాధికల పెళ్లికి సెలబ్రిటీలంతా తరలి వచ్చి.. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ వేడుకకు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయన భార్య జయా బచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందాతో పాటుగా ఆమె పిల్లలు నవ్య, అగస్త నవేలిలు అంబానీ ఇంట పెళ్లికి హజరయ్యారు. ఈసందర్భంగా వీరంతా గ్రూప్‌ ఫొటోకి ఫోజులు ఇచ్చారు. అయితే ఈ పిక్‌లో బచ్చన్‌ ఇంటి కోడలు ఐశ్వర్య రాయ్‌, ఆమె కుమార్తె ఇద్దరు మిస్‌ అయ్యారు. కోడలు, మనవరాలు ఆరాధ్య లేకుండానే ఫ్యామిలి గ్రూప్‌ ఫొటో దిగారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో.. నెటిజనులు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

బచ్చన్‌ ఫ్యామిలీ ఫొటోలో ఐశ్వర్య, ఆరాధ్య లేకపోవడం పలు అనుమానాలకు దారి తీయడమే కాక.. విమర్శలు కూడా వస్తున్నాయి. పోనీ ఐశ్వర్య, ఆరాధ్య ఈ పెళ్లికి రాలేదా అంటే అది కూడా కాదు. వచ్చారు. తల్లీకూతుల్లిద్దరే ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది గమనించిన నెటిజనులు.. అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఏడాది కాలం నుంచి అభిషేక్‌-ఐశ్వర్య విడిపోయారు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై వీరిద్దరూ ఒక్కసారి కూడా స్పందించలేదు.. ఈ వార్తలను ఖండించలేదు. ఇప్పుడీ ఘటనతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరిట్లయ్యింది.

తాజాగా ఫ్యామిలీ గ్రూప్‌ ఫొటోలో ఐశ్వర్య మిస్‌ అవ్వడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ విడిపోయారు.. ఈ ఫొటోలే ఇందుకు నిదర్శనం.. అభిషేక్‌ అనే కాదు.. మొత్తం బచ్చన్‌ కుటుంబమే ఐశ్వర్యను దూరం పెడుతున్నారు.. ఐశ్వర్యకు ఇంత కంటే మంచి భాగస్వామి రావాల్సి ఉంది.. వారు విడిపోతున్నారంటూ వస్తోన్న వార్తలు నిజమే అయితే.. అదే ఆమెకు మంచిది.. అంటూ నెటిజనులు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ వార్తలకు ఎప్పటికి చెక్‌ పడుతుందో చూడాలి.

Show comments