ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచినా టీమిండియాను కొన్ని సమస్యలు వదలడం లేదు. దీంతో ఈ ప్రాబ్లమ్స్ను సూర్య ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచినా టీమిండియాను కొన్ని సమస్యలు వదలడం లేదు. దీంతో ఈ ప్రాబ్లమ్స్ను సూర్య ఎలా పరిష్కరిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర ఓటమి నుంచి భారత క్రికెటర్లు, అభిమానులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నెక్స్ట్ ఆడే ఐసీసీ ట్రోఫీలపై ఫోకస్ పెట్టాలని ప్లేయర్లకు సూచిస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి క్రికెట్ లవర్స్కు ఊరట కలిగించేలా మంచి విజయం సాధించింది భారత్. వరల్డ్ కప్ ముగిసిన నాల్రోజులకే ఆసీస్తో మొదలైన ఐదు టీ20ల సిరీస్ను విక్టరీతో షురూ చేసింది టీమిండియా. వైజాగ్ వేదికగా గురువారం జరిగిన మొదటి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టు మూడు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు భారీ స్కోరు చేసింది. ఓపెనర్గా మారిన స్టీవ్ స్మిత్ (52) ఆకట్టుకోగా.. జోష్ ఇంగ్లిస్ (110) సెంచరీతో సత్తా చాటాడు.
ఛేజింగ్లో సూర్యకుమార్ యాదవ్ (80) చెలరేగడంతో భారత్ ఈజీగా టార్గెట్ను చేరుకుంది. మన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ డైమండ్ డకౌట్గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ (21) కూడా త్వరగానే పెవిలియన్కు చేరుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ (58) అండతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు సూర్యకుమార్. క్రీజులో సెటిలయ్యాక వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ఆ తర్వాత తక్కువ గ్యాప్లో ఈ ఇరువురూ ఔటైనా.. ఆఖర్లో రింకూ సింగ్ (22) మెరుపులు మెరిపించడంతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినా కొన్ని సమస్యలు మాత్రం వదలడం లేదు.
ఆసీస్తో ఫస్ట్ టీ20లో ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్గా వెనుదిరిగారు. తొలి ఓవర్లోనే జైస్వాల్ రాంగ్ కాల్ కారణంగా రుతురాజ్ డైమంట్ ఔట్అవ్వాల్సి వచ్చింది. రెండో రన్కు ఛాన్స్ లేకున్నా గైక్వాడ్ను పిలిచి.. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయాడు జైస్వాల్. దీంతో అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చిన రుతురాజ్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. పైకి సమన్వయ లోపంలా కనిపిస్తున్నా జైస్వాల్ రాంగ్ కాల్ వల్లే గైక్వాడ్ ఔట్ అయ్యాడని చెప్పొచ్చు. ఇన్నింగ్స్ ఆఖర్లో మరో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు ఇలాగే ఔటయ్యారు. రింకూకు స్ట్రైక్ ఇచ్చే ఉద్దేశంతో రవి బిష్ణోయ్, అక్షర్దీప్ సింగ్ రనౌట్ అయ్యారు. అయితే వీళ్లిద్దరూ మరింత వేగంగా పరిగెత్తినా, డైవ్ కొట్టినా, కాస్త ముందే రెస్పాండ్ అయినా ఈజీగా క్రీజులోకి చేరుకునేవారు.
బిష్ణోయ్, అక్షర్దీప్ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తితే ఔటయ్యేవారు కాదు. ఈ మ్యాచ్లో భారత్ బౌలింగ్ టైమ్లో మరో సమస్య బయటపడింది. టీమ్లో ఉన్న ఐదుగురు మెయిన్ బౌలర్ల సేవలు మాత్రమే వాడుకున్నారు. తిలక్ వర్మ, జైస్వాల్ రూపంలో సిక్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు. వరల్డ్ కప్లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో అతడి యాక్షన్ అందర్నీ ఆకట్టుకుంది. అయినా ఆసీస్తో ఫస్ట్ టీ20లో ఆరో బౌలింగ్ ఆప్షన్ను అతడు వాడుకోలేదు. అదే కంగారూ టీమ్ మాత్రం ఆ ఆప్షన్ను వినియోగించుకుంది.
ఈ మ్యాచ్లో కొందరు బ్యాటర్లు చెత్త షాట్ ఆడి వికెట్లు పారేసుకోవడం కూడా ఒక సమస్య అనే చెప్పాలి. సూర్యకుమార్, తిలక్లు ఔటైన ఓవర్లలో అప్పటికే పది రన్స్ వచ్చినా మరో భారీ షాట్కు వెళ్లి ఔటయ్యారు. ఆఖర్లో అవసరం లేకపోయినా అక్షర్ పటేల్ ఇలాగే ఔటయ్యాడు. అతడి ప్లేస్లో వచ్చిన బిష్ణోయ్, అక్షర్దీప్ రనౌట్ అయ్యారు. దీంతో ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్లో అనవసరంగా ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది. ఈ సమస్యల్ని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. మరి.. గెలిచినా భారత్ను సమస్యలు వదలకపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాపై మహ్మద్ షమి సీరియస్.. వాళ్లు చేసింది తప్పంటూ..!