iDreamPost
android-app
ios-app

ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదని.. తుపాకీతో ప్రియురాలిని కాల్చి తను కూడా కాల్చుకొని..

  • Published May 09, 2022 | 6:28 PM Updated Updated May 09, 2022 | 6:28 PM
ప్రేమని పెద్దలు ఒప్పుకోలేదని.. తుపాకీతో ప్రియురాలిని కాల్చి తను కూడా కాల్చుకొని..

తమ ప్రేమని పెద్దలు అంగీకరించలేదని ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని తుపాకీతో కాల్చి తను కూడా కాల్చుకొని మరణించిన సంఘటన నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్‌రెడ్డి, పొలకూరు కావ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో ఇంటిదగ్గర నుంచే వర్క్ చేస్తున్నారు.

సురేశ్‌, కావ్య ప్రేమ విషయం ఇటీవల యువతి ఇంట్లో తెలియడంతో వీరి పెళ్ళికి కావ్య తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సోమవారం సురేశ్‌ తుపాకీతో వెళ్లి కావ్యపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తను కూడా తలపై కాల్చుకుని మరణించాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్న కావ్యని అక్కడి స్థానికులు 108 ద్వారా నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె మరణించింది.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆమెపై కాల్పులు జరపడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, తుపాకీ ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.