జోరుగా కురుస్తున్న వర్షాలు.. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Heavy Rains, IMD, AP Schools, Andhra Pradesh: ఎడతెరపి లేని వానలు కురుస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

Heavy Rains, IMD, AP Schools, Andhra Pradesh: ఎడతెరపి లేని వానలు కురుస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్​లో ఇంకా పలు చోట్ల ఎడతెరపి లేని వానలు కురుస్తున్నాయి. వరదలు కూడా తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అల్లూరి జిల్లా వ్యాప్తంగా రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. జిల్లాలోని కలిదిండి, ముదినేపల్లి, భీమడోలు, మండవల్లితో పాటు కైకలూరు, ఏలూరు మండలాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా చోట్ల స్కూళ్లు మాత్రం యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు.

Show comments