ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో మృతి చెందారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదం, అనారోగ్య సమస్యలు.. ఇలా పలు కారణాలతో సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇటీవలే ప్రముఖ గాయకుడు సాయిచంద్ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో యావత్తు తెలంగాణ సమాజం విషాదంలో మునిగింది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్రారెడ్డి మృతి చెందారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి గురించి రాజకీయాలపై అనుభవం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన సీనియర్ నేత. ఆదిలాబాద్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలానే రెండు సార్లు మంత్రిగా పని చేశారు. కొంతకాలంగా రాజకీయాల్లోయాక్టీవ్ గా ఉండటం లేదు. అలానే కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందూతు కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు.