P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పోరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 74 వేల వరకు జీతం అందుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పోరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 74 వేల వరకు జీతం అందుకోవచ్చు.
P Venkatesh
మీరు ఉద్యోగా కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్నారా? మీ కలల్ని నిజం చేసుకునే సమయం వచ్చింది. మీలాంటి ఆశావాహులకు ఇదొక సువర్ణావకాశం. కేంద్ర విద్యుత్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ పోస్టులకు అర్హతలు, వయసు నిబంధనలు వంటి వివరాలు మీకోసం..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా రీజినల్ రిక్రూట్మెంట్ స్కీం కింద ఎలక్ట్రీషియన్ విభాగంలో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 203 పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ https://www.powergrid.in/ ను సందర్శించాలని కోరింది.