Dharani
Dharani
అన్ సీజన్లో దేని ధర అయిన సరే కాస్త దిగి వస్తుంది. బంగారానికి కూడా ఇదే వర్తిస్తుంది. డిమాండ్ తక్కువ ఉండటంతో.. ధర కూడా కాస్త దిగి వచ్చే అవకాశం ఉంటుంది అని భావిస్తారు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అన్సీజన్లో కూడా పుత్తడి ధరకు రెక్కలు వచ్చాయి. రాకెట్ కన్నా వేగంగా బంగారం ధర దూసుకుపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలకు అనుకూలంగా.. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చు తగ్గులు నమోదవుతాయి. అయితే గత రెండు సెషన్లలో దిగి వచ్చిన బంగారం ధర నేడు మాత్రం పెరిగింది. మరి గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎంత ఉంది అంటే…
నేడు హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది. గత రెండు సెషన్లలో బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 400 వరకు దిగి రాగా.. నేడు మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇక గురువారం భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.150 పెరిగి రూ. 55,150 వద్దకు చేరింది. అలానే 24డక్యారెట్ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 160 పెరిగి రూ. 60, 160 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఇక అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హస్తినలో చూసుకుంటే నేడు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ గోల్డ్ రేటు ధర రూ. 150 పెరిగి రూ. 55,300 వద్ద ట్రేడవుతోంది.. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల మీద 170 రూపాయలు పెరిగి.. రూ.60,320 వద్ద ట్రేడవుతోంది.
క్రితం రెండు సేషన్లలో వెండి ధర కిలో మీద ఏకంగా రూ.1000 మేర దిగివచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు సిల్వర్ రేటు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే వెండి ధర కిలోపై రూ. 400 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో సిల్వర్ రేటు రూ. 77,400 గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా నేడు వెండి ధర పెరిగింది. కిలో వెండి రేటు రూ. 400 పెరిగి రూ. 80,400 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1973.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 24.92 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.