Traffic restrictions in Hyderabad tomorrow: వాహనదారులకు అలర్ట్.. రేపు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. రేపు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్‌బండ్‌పై అంగరంగవైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్‌బండ్‌పై అంగరంగవైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్. హైదరాబాద్ మహానగరంలో రేపు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ట్యాంక్‌బండ్‌పై అంగరంగవైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు

తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లించనున్నారు. ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు డైవర్ట్ చేయనున్నారు. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తారు. నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు వాహనాలను మళ్లించనున్నారు.

హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాలి. సికింద్రాబాద్‌ వైపు వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించ‌రు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌ వైపు మళ్లించనున్నారు. ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద మళ్లించనున్నారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లించనున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాపిక్ పోలీసులు సూచించారు.

Show comments