Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో, పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 54 మంది నియమాకాలు రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో, పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 54 మంది నియమాకాలు రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కీలక నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే.. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చటమే కాకుండా.. ప్రజాదర్బార్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు పథకాలను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా పాలనాపరంగా కూడా రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా తాజాగా 54 మంది నియమాలు రద్దు చేసింది రేవంత్ సర్కార్. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చి రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వివిధ శాఖల కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో 54 మంది కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో.. ఆయా కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. వెంటనే.. 17 కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్కు పంపించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురు మాజీ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే తొలిగించింది. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకాలను కూడా రద్దు చేసింది. కాగా.. ఈరోజు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు కూడా రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మొత్తం 17 కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు రద్దయ్యాయి. ఆ వివరాలు..