Anchor Jahnavi: ఒకప్పటి స్టార్ యాంకర్ జాహ్నవి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి!

ఒకప్పటి స్టార్ యాంకర్ జాహ్నవి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూడండి!

స్మాల్ స్క్రీన్ పై ఎంతో మంది యాంకరమ్మలు అలరించారు.. ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు యాంకర్ జాహ్నవి. డాన్స్ బేబీ డాన్స్ తో సహా పలు షోలు చేసిన ఆమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..

స్మాల్ స్క్రీన్ పై ఎంతో మంది యాంకరమ్మలు అలరించారు.. ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు యాంకర్ జాహ్నవి. డాన్స్ బేబీ డాన్స్ తో సహా పలు షోలు చేసిన ఆమె ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..

బుల్లితెరపై ఎంతో మంది తమ యాంకరింగ్‌లతో అలరించారు.. అలరిస్తూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుండి తన మాటల గలగలలతో స్మాల్ స్క్రీన్‌పై మకుటం లేని మహారాణిగా రాణిస్తోంది యాంకర్ సుమ. ఇప్పుడు యాంకరింగ్ అంటే  చాలా మందికి అవగాహన ఏర్పడింది కానీ.. టీవీ ఇండస్ట్రీ మొదలైన కొత్తలో ఇన్ని అవకాశాలు, సదుపాయాలు లేని సమయంలో కూడా కొంత మంది వ్యాఖ్యతలుగా రాణించి గుర్తింపు పొందారు. హార్లిక్స్ హృదయాంజలి అంటూ డేరింగ్ గర్ల్ ఉదయభాను చేసిన యాంకరింగ్‌కు పడి చచ్చిపోయేవాళ్లు కుర్రాళ్లు. ఇక ఝాన్సీ అయితే ’టాక్ ఆఫ్ ది టౌన్‘అనే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేది. ఇక సుమ అయితే స్టార్ మహిళ కాకుండా పట్టుకుంటే పట్టు చీర, భలే ఛాన్సులే వంటి షోస్‌తో అలరించింది. అనుపమ, శిల్పా చక్రవర్తి, మల్లిక, అనితా చౌదరి తమదైన యాంకరింగ్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నారు.

ఈ రోజుల్లో ఎక్కువ ఎంటర్ టైన్‌మెంట్ ఛానల్స్ పుట్టుకు వచ్చి.. వ్యాఖ్యతలకు డిమాండ్ పెరిగింది. కానీ ఒకప్పుడు ఉన్న రెండు మూడు ఛానల్స్‌లో తమ యాంకరింగ్‌తో అదరగొట్టేవారు  ఈ యాంకరమ్మలు. అలాంటి వారిలో ఒకరు జాహ్నవి. ఇప్పటి వరకు అస్సలు పరిచయం లేని పేరు కానీ.. ఒకప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షోకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఈ షో ఆమె వల్ల సక్సెస్ ఫుల్‌గా రన్ అయ్యిందని చెప్పొచ్చు. పలు షోలతో పాటు ఆమె సినిమాల్లో కూడా నటించింది. ఒకరికి ఒకరు, హ్యాపీ మూవీల్లో తన నటనతో మెప్పించింది. కానీ ఆమె గుర్తుండిపోయే పాత్ర చేసింది యజ్ఞం మూవీలో. అందులో ముస్లిం యువతిగా నటించింది. హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో ఒకరిగా కనిపించింది.

‘అందరు నాదీ ఎగతాళి చేస్తార్.. నాది కూడా మాట్లాడతాది. ఎవరు ఏం చేస్తారో చూస్తాది. నీది రాయలసీమ అయితే.. నాది ఓల్డ్ సిటీ.. కుతుబు షాకీ కాందానీ’ అంటూ లొడలొడ వాగేస్తూ ఉంటుంది. కానీ అందులో హీరోయిన్ ఆమె తండ్రికి జాహ్నవిని మూగ అమ్మాయిగా పరిచయం చేస్తుంది. దీంతో మూగ పిల్లగా నటిస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తుంది జాహ్నవి. అందులో ధర్మవరపు సుబ్రమణ్యంతో మాట్లాడుతూ ‘కాకా, కాకా.. ఇది ఊరిలో గుడులు ఉన్నాయి క్యా.. మసీదు కూడా ఉంది క్యా.. ఉంటే కిదర్ హై.. సుక్రియా’ అంటూ మాట్లాడుతుంది. నువ్వు మూగదానివి కదా.. ఎలా మాట్లాడుతున్నావ్ అని ధర్మవరపు సుబ్రమణ్యం ‘నాది ఎట్లా మాట్లాడింది.. నాది అంతా మెమ్మెమ్మె.. బెబెబ్బె’ అంటూ వెళ్లిపోతుంది. ఇందులో ఇది బెస్ట్ కామెడీ సీన్ అనే చెప్పాలి. అలాగే ఓ కీలక సన్నివేశంలో చెలరేగిపోయి నటించింది.

కాగా, హ్యాపీ మూవీ తర్వాత ఆమె మెల్లిగా వెండితెర, బుల్లితెర నుండి వైదొలిగింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోరీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు. రసూల్ ఎల్లోరి సినిమాటోగ్రాఫరే కాదూ డైరెక్టర్ కూడా. ఒకరికి ఒకరు, భగీరధ వంటి చిత్రాలకు దర్శకుడు ఆయన. ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ ఆయన. గులాబీ, లిటిల్ సోల్జర్స్, చిత్రం, కిక్, ఊరసవెల్లి, అమ్మమ్మగారి ఇల్లు, ఏజెంట్ చిత్రాలకు పని చేశాడు. ఒకరికొకరు సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. కాగా, ఆమె కంటే.. అతడు 15 ఏళ్ల పెద్ద వాడని తెలుస్తోంది. గోపాల్ రెడ్డి, సమీర్ రెడ్డికి సమీప బంధువు కూడా. ఇప్పుడు ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కాగా, జాహ్నవి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. ఈ సారి హీరోయిన్‌గా కాదూ.. ప్యాషన్ డిజైనర్‌గా. ఎవరు చిత్రానికి రెజీనా కాసాండ్రాకు డ్రెస్ డిజైనింగ్ ఆమె చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ ఆమె తెరపై  కనిపిస్తే చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్.

Show comments