P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరగా అప్లై చేసుకోండి.
P Venkatesh
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. డిగ్రీ, పీజీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. లక్షన్నరకు పైగా జీతాన్ని పొందొచ్చు. మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యమైతే ఈ జాబ్స్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తాజాగా న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిరుద్యోగులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్తను అందించింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 100 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్ ఎరెక్షన్, మెకానికల్ ఎరెక్షన్, సివిల్ కన్స్ట్రక్షన్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 03 2024 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ https://careers.ntpc.co.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.