P Venkatesh
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందొచ్చు.
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందొచ్చు.
P Venkatesh
మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హతతోనే మీరు ఎయిర్ పోర్టులో ఉద్యోగం సాధించొచ్చు. అంతేకాదు నెలకు రూ. లక్షకు పైగా జీతాన్ని పొందే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కసి ఉంటే ఇలాంటి జాబ్స్ కొట్టి జీవితంలో సెటిల్ అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం త్యరగా అప్లై చేసుకోండి.
చెన్నైలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్లోని వివిధ విమానాశ్రయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందినవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 26 2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://www.aai.aero/ ను పరిశీలించాల్సి ఉంటుంది.