Anakapalli Crime News: బ్రేకింగ్: నారాయణ కాలేజ్ లో విద్యార్థి వంశి ఆత్మహత్య!

బ్రేకింగ్: నారాయణ కాలేజ్‌లో విద్యార్థి వంశి ఆత్మహత్య!

మనస్థాపానికి గురైన ఓ విద్యార్తి బలవన్మరణానికి పాల్పపడటంతో తీవ్ర కలకలం రేగింది.

మనస్థాపానికి గురైన ఓ విద్యార్తి బలవన్మరణానికి పాల్పపడటంతో తీవ్ర కలకలం రేగింది.

ఇటీవల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తమ పిల్లలను ఉన్న విద్యావంతులుగా తీర్చి దిద్ది సమాజంలో గొప్ప పొజీషన్లో చూడాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందుకోసం పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థలకు పంపుతున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లలకు మంచి ర్యాంకులు తెప్పిస్తామంటూ తల్లిదండ్రులను ఈజీగా నమ్మించి లక్షల్లో ఫీజు వసూళ్లు చేస్తున్నారు. ఇక గ్రేడ్స్, ర్యాంకుల కోసం విద్యార్థులను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చదువులో వెనుకబడిన వారిపై ఒత్తిడి తీసుకువస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే అనకాపల్లిలో చోటు చేసుకుంది.

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి  నారాయణ కాలేజ్ లో వంశి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడ్డట్టు తెలుస్తుంది. అయితే తమ కొడుకు మృతికి  యాజమాన్యం వేధింపులే  కారణం అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థి బంధువులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Show comments