విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ వేస్తుంటే మేమంతా భయపడిపోయేవాళ్లం: భువనేశ్వర్ కుమార్

  • Author Soma Sekhar Updated - 01:01 PM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Updated - 01:01 PM, Tue - 22 August 23
విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ వేస్తుంటే మేమంతా భయపడిపోయేవాళ్లం: భువనేశ్వర్ కుమార్

సాధారణంగా క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తమ మనసులోని మాటలను, టీమ్మెట్స్ మధ్య జరిగిన సంఘటనలను పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇతర ఆటగాళ్లపై సరదా, సరదా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా ‘CEAT’ కంపెనీ పలు విభాగాల్లో క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ను ప్రధానం చేసింది. ఈ అవార్డ్ ఫంక్షన్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా పలువురు టీమిండియా ఆటగాళ్లు మెరిశారు. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ లో జరిగిన ఓ చిట్ చాట్ లో విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్. కోహ్లీ బౌలింగ్ వేస్తుంటే మేం భయపడిపోయే వాళ్లం అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

CEAT క్రికెట్ అవార్డ్ ఫంక్షన్ లో టీమిండియా ఆటగాళ్లు తళుక్కున మెరిశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా శుభ్ మన్ గిల్, భువనేశ్వర్ కుమార్ లు ఈ ఈవెంట్ కు హాజరైయ్యారు. భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది బెస్ట్ టీ20 బౌలర్ గా ఎంపికవ్వగా.. గిల్ CEAT క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రోహిత్ శర్మ చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక ఈ వేడుకలో జరిగిన చిట్ చాట్ లో ఫన్నీ కామెంట్స్ చేశాడు భువనేశ్వర్ కుమార్. “టీమిండియాలో బెస్ట్ బౌలర్ తానే అని విరాట్ కోహ్లీ అనుకుంటాడు. ఇక అతడు బౌలింగ్ చేస్తుంటే మేమందరం భయపడి చచ్చేవాళ్లం. అతడి బౌలింగ్ యాక్షన్ వల్ల అతడికి ఎలాంటి గాయాలు కావని మాకు తెలుసు” అంటూ నవ్వులు పూయించాడు భువనేశ్వర్ కుమార్. భువీ మాటలతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.


ఇదికూడా చదవండి: స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న పాక్‌ టీమ్‌! ఆసియా కప్‌లో హోరాహోరీ పోరే

Show comments