మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు కింద పడడంతో సాయిధరమ్తేజ్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన బైక్ వేగంగా నడపడంతో టుడే రోడ్డు ప్రమాదం జరిగిందని ఒకసారి, లేదు రోడ్డు మీద ఇసుక లాంటి పదార్థం ఉంది కాబట్టి వేగంగా వెళుతున్న బైక్ అదుపు తప్పి పడిపోయాడని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. మీడియా సంస్థలు అయితే పూర్తిగా ఫోకస్ అంతా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం మీదనే పెట్టి అలాంటి బైకులతో షూటింగ్ లు కూడా జరిపిన పరిస్థితి అందరం చూశాం. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు అపోలో హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందిన తర్వాత సాయి ధరంతేజ్ కోలుకున్నాడు.
దసరా సందర్భంగా ఆయన కోలుకున్నాడు అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆయన రోడ్డు ప్రమాదం తర్వాత అడపాదడపా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు కానీ రోడ్డు ప్రమాదం విషయం ఏమైంది అనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. అసలు రోడ్డు ప్రమాదానికి కారణం సాయి ధరంతేజ్ బండి వేగంగా నడపడమా? లేక ఇసుక రోడ్డు మీద పడి ఉండటమా అనే విషయం మీద ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే విషయాన్ని తాజాగా సైబరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ను మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో పాల్గొన్న కమిషనర్ స్టీఫెన్ రవింద్ర బైక్ యాక్సిడెంట్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయమై కేసు నమోదు చేశామని తెలిపిన కమిషనర్ ఆయన కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చామని, ఆ నోటీసుల్లో భాగంగా లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఆర్సీ, ఇన్సురెన్స్ వంటి డ్యాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలని కోరామని అన్నారు. అయితే సాయ్ ధరమ్ తేజ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరణ రాలేదని తెలిపారు. తేజ్ నుంచి స్పందన రాని కారణంగా అతనిపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు రవీంద్ర వెల్లడించారు. మరి ఇప్పటికైనా తేజ్ వెళ్లి వివరణ ఇవ్వకుంటే చిక్కుల్లో చిక్కు కోక తప్పదు. దీనిపై తేజ్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి మరి.
Also Read : Rajesh Khanna : తెరపై రాబోతున్న అమ్మాయిల ఆరాధ్య హీరో కథ