Crazy Buzz On Maa Oori Cenima: అక్టోబర్ 12న "మా ఊరి సిన్మా".. విడుదలకి ముందే మంచి బజ్!

అక్టోబర్ 12న “మా ఊరి సిన్మా”.. విడుదలకి ముందే మంచి బజ్

‘మా ఊరి సిన్మా’ ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఈ సినిమా వైరల్ అవుతోంది. శ్రీమంజునాథ సినిమాస్ పతాకంపై మంజునాథ్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. శివరాం తేజ దర్శకత్వంలో పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 12న మా ఊరి సిన్మా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. విడుదల చేసిన పోస్టర్ మొదలు సాంగ్స్, ట్రైలర్ మొత్తానికి మంచి రెస్పాన్స్ లభించింది.

పుట్టిన ఊరిలోనే ఉండాలని, పుట్టిన ఊరులోనే సినిమా తీయాలని, పుట్టిన ఊరులోనే పేరు సంపాదించుకోవాలని కలలు కనే ఓ కుర్రాడి కథ ఇది. ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని అతను చేసే ప్రయత్నాలు, అందుకు ఎదురయ్యే అడ్డంకులు, అతని ప్రేమ, పోరాటాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఆ కుర్రాడు అతను కలలు కన్న సినిమాని పూర్తి చేయగలిగాడా? తన సినిమా థియేటర్లో తాను ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టి తనదాన్ని చేసుకోగలిగాడా? అనేది మూవీలో చూడాల్సింది.

ఈ సినిమా గురించి నిర్మాత  మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలోని పాటలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. లక్షల కొద్దీ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ కావడంతో ఆ యాసలో ఉన్న డైలాగ్స్ కి మంచి అప్లాజ్ వస్తోంది. ఓవరాల్ గా సినిమా కూడా బాగా వచ్చింది. ఇప్పటికే మూవీ చూసిన చాలామంది పెద్దలు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మా అందరి సమిష్టి విజయం. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఎంతో బాగా నచ్చుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.

నిర్మాత మంజునాథ్ రెడ్డి ఈ సినిమాలో బుల్ రెడ్డి అనే ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ లో నటించారు. హీరోకు మద్దతుగా ఉండే ఈ పాత్రను కూడా డైరెక్టర్ ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ అద్భుతమైన పాత్రకు ఎక్కు బండెక్కు మామ అనే స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ పాటకు ఎస్కే బాజీ సంగీతం సమకూర్చగా.. మంగ్లీ సోదరి ఇద్రావతి చౌహాన్ ఆలపించారు. ఇప్పటికే ఈ పాట 11 లక్షలకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Show comments