నీ పెళ్లాన్ని మాకిచ్చెయ్.. లేదంటే చంపేస్తామంటూ దుండగుల బెదిరింపులు!

నీ పెళ్లాన్ని మాకిచ్చెయ్.. లేదంటే చంపేస్తామంటూ దుండగుల బెదిరింపులు!

ఈ రోజుల్లో కొందరు మగాళ్లు కాస్త మృగాలుగా మారిపోతున్నారు. మద్యం మత్తులో ఉంటూ ఎంతకైనా తెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. నీ పెళ్లాన్ని మాకిచ్చెయ్.. లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే ఘటన ఇప్పడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బాంద జిల్లాలోని ఓ ప్రాంతం. ఇక్కడే కొందరు నివాసం ఉంటున్నారు. అయితే, ఇటీవల ఆ వ్యక్తులు ఫుల్ గా మద్యం తాగి హల్చల్ చేశారు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని ఆ ఇద్దరు వ్యక్తులు ఓ చోట అడ్డగించారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక.. నీ భార్య నీకు సెట్ కాదని, మాకు ఇవ్వాలంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. ఇంతటితో ఆగకుండా.. నీ పెళ్లాన్ని మాకు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. నిజంగా చంపేస్తారన్న భయంతో అతడికి ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show comments