ఘోరం: కదులుతున్న రైలులోనే యువతిపై ఇద్దరు యువకులు ఒకేసారి..!

ఘోరం: కదులుతున్న రైలులోనే యువతిపై ఇద్దరు యువకులు ఒకేసారి..!

చెన్నైలో ఘోరం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఆ దుర్మార్గులు కదులుతున్న రైలులోనే ఆ యువతిపై అందరిముందే ఊహించని విధంగా ప్రవర్తించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూతురిపై జరిగిన దారుణాన్ని సహించలేక ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని కందన్ చావడి తిరువిక ప్రాంతంలో ప్రీతి (22) అనే యువతి నివాసం ఉంటుంది. ఆమె కొట్టూరుపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే, ఈ నెల 2న పని ముగించుకుని ఎప్పటిలాగే సబర్బన్ రైలు ఎక్కింది. ఇదే రైలు ఎక్కిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఆ యువతిపై కన్నేశారు. ఎలాగైన ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువకులు ఆమె సెల్ ఫోన్ లాక్కోవాలని అనుకున్నారు. దీంతో అలెర్ట్ ఆ యువతి వారితో వాగ్వాదానికి దిగింది. ఇక కోపంతో ఊగిపోయిన ఆ యువకులు.. కదులుతున్న రైలులోనే ప్రీతిపై దాడికి యత్నించారు.

ఇక ఇంతటితో ఆగకుండా ఆ రైలు ఇందిరా నగర్ వద్దకు రాగానే ఆ దుండగులు ఆ యువతిని రైలులో నుంచి కిందకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ప్రీతిని స్థానిక ఆస్పత్రికి తరలించింది. ఫలితం లేకపోవడంతో ఆ యువతి అప్పటికే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టినపాక్కంకు చెందిన వారిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Show comments