Karnataka Tumkur-Degree 2nd Year Student Crime News: పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు

పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు

పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల యువతి. అతడి కోసం కన్న వారిని సైతం వదులుకుని వెళ్లిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే..

పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల యువతి. అతడి కోసం కన్న వారిని సైతం వదులుకుని వెళ్లిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే..

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు.. కులం, ఆస్తి, అంతస్తు వంటి విషయాలను పట్టించుకోదు.. కచ్చితంగా చెప్పాలంటే.. ప్రేమ గుడ్డిది అంటారు కొందరు. ఇక సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. ఇది నిజమే అనిపించకమానదు. నేటి కాలంలో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు పెరిగి పోతున్నాయి. ప్రేమించకపోతే.. అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదనే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇక ప్రేమించిన వారితో కలిసి బతకలేని పరిస్థితులు వస్తే.. ప్రాణాలు తీసుకునే వారు కొందరు. ఈ క్రమంలో ఓ దారుణం వెలుగు చూసింది. పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది 19 ఏళ్ల ఓ యువతి. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవారిని కూడా వదిలేసి వెళ్లింది. మరి చివరకు ఆ యువతికి ఏం జరిగింది.. ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటే..

అతడి వయసు 40 సంవత్సరాలు.. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అతడు తనకన్నా 20 ఏళ్ల చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించి తన వెంట తిప్పుకోవడం ప్రారంభించాడు. ఆయువతి ఎంత మత్తులో ఉందంటే.. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్న వాళ్లను సైతం వదులుకుని.. అతడితో వెళ్లింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. లవర్‌తో వెళ్లిన యువతి చివరికు చెరువులో శవమై తేలింది. యువతిని తీసుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటన కర్ణాటక, తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా మావత్తురుగ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య(40) అనే వ్యక్తికి పెళ్లై.. ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు.

ఈ క్రమంలో అతడికి లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన అనన్య(19)తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె బీకాం సెకండియర్‌ చదువుతోంది. ఈ క్రమంలో తన వయసులో సగం ఏజ్‌ ఉన్న అనన్యకు మాయ మాటలు చెప్పి.. తనను ప్రేమించేలా చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. తల్లిదండ్రులు నిలదీయడంతో.. తాను రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని అనన్య తెగేసి చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లై, పిల్లలున్న వ్యక్తితో వివాహం ఏంటని మందలించారు. దాంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించిన అనన్య.. మూడు రోజుల క్రితం రంగశ్యామయ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది.

దాంతో అనన్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనన్య కోసం గాలస్తుండగా.. ఆదివారం మావత్తురు చెరువులో యువతి మృతదేహం తేలియాడుతుందని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం అనన్యదిగా గుర్తించారు. గట్టుపై ఇద్దరి పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అనన్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Show comments