Crime News: వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమ పెళ్లి.. చివరికీ

వరుసకు అన్నాచెల్లెళ్లు.. ప్రేమ పెళ్లి.. చివరికీ

వారిద్దరిదీ ఒకే ఊరు. దూరపు బంధువులే. వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతున్నారు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చేస్తున్నది తప్పు అని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. వీరి విషయం తల్లిదండ్రులకు తెలిసింది.

వారిద్దరిదీ ఒకే ఊరు. దూరపు బంధువులే. వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతున్నారు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చేస్తున్నది తప్పు అని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. వీరి విషయం తల్లిదండ్రులకు తెలిసింది.

నేడు కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మనిషి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాడు కానీ నడక మాత్రం ఆటవిక సమాజం వైపు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఆదిమానవుల కాలంలో వావి వరుసలు మర్చిపోయి.. ఎలా పడితే అలా జీవనం సాగించేవారు అప్పటి ప్రజలు. ఆధునిక చెందుతూ.. చెందుతూ.. సంబంధాలను ఏర్పరుచుకున్నాం.ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వావి వరుసలు ఏర్పాటు చేసుకున్నాం. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నాం. కానీ నేటి సమాజంలో అవన్నీ మర్చిపోయి.. అక్కా,చెల్లెళ్లు వరుసయ్యే వ్యక్తులను ప్రేమిస్తున్నారు కొంతమంది . కాదంటే..ఏదైనా చేసేందుకు సిద్ధమౌతున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా.. వీరిద్దరు భార్యా భర్తలు. కానీ పెళ్లి కాక ముందు వరుసకు అన్నా, చెల్లెళ్లు. దూరపు బంధువులు. ప్రేమలో పడ్డారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరారు. తాము చేస్తుందని తప్పు అని తెలిసి కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే వీరి విషయం ఇంట్లో పెద్దలకు తెలిసి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతలో ప్రియురాలికి పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్న అతడు.. ఆమెను ఎత్తి కెళ్లి మెడలో తాళి కట్టాడు. అనంతరం వీరిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

యాడ్రామి తాలూకా మాగణగేరా గ్రామానికి చెందిన గొల్లాళప్ప, శశికళ దూరపు బంధువులు. వరుసకు వీరిద్దరూ అన్నా చెల్లెళ్లు అవుతుంటారు. వీరిద్దరూ ప్రేమ మాయలో పడి చక్కర్లు కొట్టడం స్టార్ చేశారు. చివరికి వీరి వ్యవహరం ఇంట్లో వాళ్లకు తెలిసి తీవ్రంగా చీవాట్లు పెట్టారు. అయితే శశికళకు వేరే సంబంధాలు స్టార్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఓ యువకుడితో నిశితార్థం చేశారు. వచ్చె నెలలో పెళ్లి. వివాహానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో గొల్లాళప్ప శుక్రవారం రాత్రి శశికళను మాగణగేరాలోని గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అనంతరం సెల్ఫీ తీసుకుని మిత్రులకు పంపాడు. తల్లిదండ్రులు ఇక మమ్మల్ని విడదీయలేరని పేర్కొన్నాడు. అంతలో అక్కడే ఉన్న చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments