Sucide: పని ఒత్తిడికి మరో ప్రాణం బలి.. సూసైడ్ చేసుకున్న బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి!

Sucide: కొన్ని కంపెనీల్లో పని ఒత్తిడి దారుణంగా ఉంటుంది. ఉద్యోగులు తట్టుకోలేని విధంగా ఉంటుంది. పని ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి.

Sucide: కొన్ని కంపెనీల్లో పని ఒత్తిడి దారుణంగా ఉంటుంది. ఉద్యోగులు తట్టుకోలేని విధంగా ఉంటుంది. పని ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి.

కొన్ని కంపెనీల్లో పని ఒత్తిడి మహా దారుణంగా ఉంటుంది. ఎంతలా అంటే ఉద్యోగులు తట్టుకోలేని విధంగా ఉంటుంది. మనిషిని మెషిన్ లా పని చేయించుకుంటాయి. దాంతో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. అంతేగాక మానసిక వేదనకు గురై ఉద్యోగులు సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈమధ్యనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఒక ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా చనిపోయారు. తాజాగా యూపీలో పని ఒత్తిడి తట్టుకోలేక మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బజాజ్ ఫైనాన్స్‌లో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అతని పేరు తరుణ్ సక్సేనా. సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకొని చనిపోయారు. తన చావుకు సీనియర్‌ అధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ అయిదు పేజీల సూసైడ్‌ నోట్ రాశారు. ఆఫీసులో తనకు ఇచ్చిన టార్గెట్‌లు పూర్తి చేయలేకపోయారట. అందుకే గత రెండు నెలల నుంచి తన సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. లేదంటే జీతంలో కోతలు విధిస్తామని బెదిరిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశారు.

తాను ఎంత కష్టపడ్డా కానీ ఇచ్చిన టార్గెట్ లని చేరుకోలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని తెలిపాడు. పైగా సీనియర్లు పదే పదే సూటి పోటీ మాటలతో అవమానిస్తున్నారని తెలిపారు. దాంతో ఉద్యోగం పోతుందని ఆందోళన చెందుతున్నట్లు నోట్ లో రాశారు. పాపం ఆ వ్యక్తికి కనీసం కంటి నిండా నిద్ర కూడా లేదని వాపోయారు. గత 45 రోజుల నుంచి సరైన నిద్ర కూడా లేదట. భవిష్యత్తుపై చాలా భయంగా ఉందని, అందుకే చనిపోతున్నానని తెలిపారు. ”పిల్లల స్కూల్ ఫీజులను ఏడాది చివరి దాక చెల్లించాను. మేఘా, యథార్థ్, పీహులను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ, నాన్న నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా కుటుంబం సంతోషంగా ఉండేందుకు దయచేసి రెండో అంతస్తును కట్టించండి. నా పిల్లలను బాగా చదివించండి.” అని తెలిపారు.

తన కుటుంబానికి బీమా సొమ్ము అందేలా చూడాలని కోరారు. అంతేగాక సీనియర్ల పేర్లను కూడా రాసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని తన కుటుంబాన్ని కోరారు. తరుణ్ కి తల్లిదండ్రులు, భార్య మేఘా, పిల్లలు యథార్థ్‌, పిహు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీస్ అధికారి వినోద్‌ కుమార్‌ గౌతమ్‌ తెలిపారు. తన సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్లు సూసైడ్‌ నోట్ లో రాశారని, ఆయన కుటుంబం ఫిర్యాదు చేస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఈ విషాద ఘటనపై మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments