YS Jagan: వీడియో: దుమ్ములేపుతున్న CM జగన్ కొత్త సాంగ్!

వీడియో: దుమ్ములేపుతున్నCM జగన్ కొత్త సాంగ్!

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే అనేక సాంగ్స్ వచ్చాయి. ఆయనపై వచ్చిన పలు సాంగ్స్ సెన్సెషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా 2024 ఎన్నిక నేపథ్యంలో జగనన్న కొత్త సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.

YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే అనేక సాంగ్స్ వచ్చాయి. ఆయనపై వచ్చిన పలు సాంగ్స్ సెన్సెషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసందే. తాజాగా 2024 ఎన్నిక నేపథ్యంలో జగనన్న కొత్త సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన్నే సీఎం చేయాలనే ధృడ నిశ్చయంతో ప్రజలు ఉన్నట్లు పలు సర్వేలు సైతం వెల్లడించాయి. 2024 వన్స్ మోర్ జగన్ అంటూ ప్రజలు సైతం పిలుపు ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే..సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వచ్చే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఆయనపై వచ్చిన పలు సాంగ్ లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆకోవాలోనే తాజాగా మరో పాట వచ్చి చేరింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పటికే అనేక సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో విడుదలైన పలు పాటలు సోషల్ మీడియాలో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. అలానే కొన్ని సాంగ్స్ అయితే పలు రికార్డులను సైతం క్రియేట్ చేశాయి.  అలానే ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై సూపర్ సాంగ్స్ వచ్చాయి. తాజాగా వైసీపీ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ మరో పాట విడుదలైంది.

2024 ఎన్నిక నేపథ్యంలో జగనన్నపై కొత్త సాంగ్ విడుదలైంది. తండ్రికి తగ్గ తనయుడు అంటూ, మాట ఇచ్చిన నాయకుడు అంటూ 2024 ఎన్నికల సాంగ్ ను వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విడుదల చేసింది. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఇచ్చిన మాట తప్పుతే ఒట్టు అంటూ ప్రారంభమయ్యే ఈ సాంగ్ ఆసాంతం అదిరిపోయింది. వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటే..ఈ పాట ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తే జగన్ అని ఆ పాటలో తెలిపారు.

సంక్రాంతి కానుకగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఈ కొత్త సాంగ్ రిలీజైంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పల్లెలతో పాటు ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు, సంక్షేమం నేరవేర్చిన హామీలను చూపిస్తూ ఈసాంగ్ ను రూపొందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా  రూపొందించిన జగనన్న కొత్త సాంగ్ మాములుగా లేదు. ఈ  సాంగ్ యూట్యూబ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మీరు కూడా జగనన్న కొత్త సాంగ్ ను చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments