iDreamPost

బ్రేకింగ్: గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి!

బ్రేకింగ్: గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి!

ప్రజా యుద్ధ నౌక గద్దర్ ( గుమ్మడి విఠల్ రావు) అంతిమ యాత్ర హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ లోని ఆయన ఇంటి వరకు కొనసాగింది. దీంతో గద్దర్ ను కడసారి చూసేందుకు రాష్ట్రం నలువైపుల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక గద్దర్ చివరి చూపు కోసం అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందినట్లు సమాచారం. దీంతో పాటు పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: గద్దర్ కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి