Dharani
Dharani
మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. కట్టుకున్న భార్య విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఓ నటుడు. ఇదిలా ఉండగానే.. నటుడి మీద కొందరు రౌడీలు దాడి చేశారు. దాంతో తనకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నందుకు.. సదరు నటిడి భార్యే.. అతడిపై దాడి చేయించి కాళ్లు విరగొట్టించిందని భావిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. ‘అసత పోవతు యారు’, ‘కలకప్పోవత్తు యారు’ వంటి కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ కమెడియన్ వెంకటేశ్. టీవీల్లో వచ్చే కామెడీ షోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ గురించి ఓ వార్త అటు కోలీవుడ్లో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. కమెడియన్ భార్య.. అతడి కాళ్లు విరగొట్టించింది అని ప్రచారం సాగుతోంది. అసలేం జరిగింది అంటే..
కొన్ని రోజుల క్రితం కమెడియన్ వెంకటేశ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో అతడిపై దాడి జరిగింది. ముగ్గురు వ్యక్తులు కారును ఆపి అందులో ఉన్న డ్రైవర్ను వెళ్లిపోమని బెదిరించారు. ఆ తర్వాత వెంకటేశ్ను పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి లాక్కెళ్లి.. చితకబాదారు. తనను కాపాడమంటూ కమెడియన్ ఆర్తనాదాలు చేయడంతో.. అవి విన్న స్థానికులు.. అక్కడికి చేరుకోవడంతో.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన కమెడియన్ను.. ప్రజలు ఆస్పత్రిలో చేర్పించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. వెంకటేశ్.. కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు.
అయితే ఘటనా స్థలంలో బీజేపీ జెండాలు కనిపించడంతో ఇది ఆ పార్టీ కార్యకర్తల పనే అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. కమెడియన్ వెంకటేశ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను వ్యతిరేకించినవారే ఆయనపై ఈ దాడి చేయించి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే వెంకటేశ్ వాదన మరోలా ఉంది. తన భార్య భానుమతికి, డ్రైవర్ మోహన్కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. తనను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే.. తన భార్య, ఆమె ప్రియుడు డ్రైవర్ మోహన్.. ఈ పని చేశారంటున్నాడు. అంతేకాక.. దాన్ని వేరే వాళ్ల మీదకు తోస్తున్నారని తెలిపారు. తన భార్యే డబ్బులిచ్చి మరీ గూండాలతో తనపై దాడి చేయించిందని పేర్కొంటున్నాడు.
అయితే వెంకటేశ్కు కోయంబత్తూరుకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆమె కోసమే భార్య భానుమతికి విడాకుల నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తోంది. భర్తను దూరం చేసుకోవడం ఇష్టం లేకనే భానుమతి ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. అతడి కాళ్లు విరగ్గొట్టించి.. తనతో పాటు ఇంట్లో ఉండిపోయేలా చేసేందుకే ఆమె ఇలా స్కెచ్ వేసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.