హుస్సేన్ సాగర్ లోకి భారీ వరద.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు!

Hyderabad News: హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండాల మారింది. ఈ క్రమంలోనే నగర ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు.

Hyderabad News: హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండాల మారింది. ఈ క్రమంలోనే నగర ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వివిధ జిల్లాల్లో భారీ వానలకు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా సోమవారం నుంచి భారీ వాన కురుస్తుంది. ఇక సోమవారం సాయంత్రం, మంగళవారం తెల్లవారు జాము సమయంలో కుండపోత వాన కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపించాయి. ఇదే సమయంలో హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు చేరి..నిండుకుండాల మారింది. దీంతో ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ చేస్తున్నారు.

Show comments