Ajith Movie OTT : మరోసారి గ్యాంబ్లర్ మూవీ కాంబో రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే OTT డీల్ ఫిక్స్!

Ajith Movie OTT : మరోసారి గ్యాంబ్లర్ మూవీ కాంబో రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే OTT డీల్ ఫిక్స్!

తమిళంలో బాగా పాపులర్ అయిన.. బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంబ్లర్. ఇప్పుడు ఇదే మూవీలో నటించిన ముగ్గురు స్టార్ యాక్టర్స్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు..ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా.. అంతలోనే మూవీ ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయాయట.

తమిళంలో బాగా పాపులర్ అయిన.. బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంబ్లర్. ఇప్పుడు ఇదే మూవీలో నటించిన ముగ్గురు స్టార్ యాక్టర్స్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు..ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగా.. అంతలోనే మూవీ ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయాయట.

సినిమాలు థియేటర్ లోకి వచ్చిన వెంటనే ఆయా సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడు పోవడం.. ఇప్పడు చాలా కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇంకాస్త అడ్వాన్స్ అయ్యాయి. సినిమా ఇంకా పూర్తి కాకముందే.. ఆయా సినిమాల ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకముందే.. ఆ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయట. తమిళంలో బాగా పాపులర్ అయినా ఓ బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంబ్లర్. ఈ సినిమాలో అజిత్ కుమార్ , త్రిష , అర్జున్ సర్జా కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీనితో పాటు ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ కూడా లాక్ అయిపొయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

అజిత్ కుమార్ , త్రిష , అర్జున్ సార్జా కలిసి నటిస్తున్న ఈ సినిమా పేరు.. “విడాముయర్చి”. అంటే తెలుగులో దీని అర్ధం పట్టుదల. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ ముగ్గురు స్టార్ యాక్టర్స్ కలిసి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు కాబట్టి.. ఇప్పుడు మళ్ళీ కలిసి నటించడంతో.. ఈ సినిమాపై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి.. అజిత్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక విడాముయర్చి సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

టీజర్, ట్రైలర్స్ లాంటివి కూడా రిలీజ్ కాకుండానే.. కేవలం మూవీ ఫస్ట్ లుక్ తోనే.. భారీ ధరలకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా టాక్ మొదలైనప్పటినుంచి కూడా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ అధినేత .. సుభాస్కరన్ నిర్మించారు. విడాముయర్చి సినిమాలో త్రిష, అజిత్ కుమార్ , అర్జున్ సార్జా తో పాటు ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి.. మిగిలిన అప్ డేట్స్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments