మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పూజాపురం రవి.. వందకు పైగా చిత్రాల్లో నటించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 86 ఏళ్ల రవి.. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయన కుమార్తె లక్ష్మి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కుమార్తె నివాసంలో రవి కన్నుమూశారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన పేరు రవీంద్రన్ నాయర్. పూజాపురం అనేది ఆయన పుట్టిన ఊరు. ఇది తిరువనంతపురంకి దగ్గరలో ఉంటుంది.
రవి తన హస్కీ వాయిస్ తో స్పాంటేనియస్ డైలాగ్స్, యాక్టింగ్ తో సినీ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. పూజాపురం రవి..మాలా అరవిందన్, అలుమూదన్ వంటి ఇతర నటీనటుల సమకాలికుడు. ఒకప్పటి వీరందరు మలయాళ సినిమాలలో హాస్య సన్నివేశాలను పడించేవారు. ముత్తారంకున్ను పీవో, పూచైక్కోరు ముక్కుతి, లవ్ ఇన్ సిగ్నపూర్, మజా పెయ్యున్ను మద్దలం కొట్టున్ను, రౌడీ రాము, కడతనదన్ అంబడి వంటి సూపర్ హిట్ సినిమాలో రవి నటించారు. 2016లో రోహిణి, టోవినో నటించిన గప్పి అనే మూవీలో చివరి సారిగా నటించారు. అదే ఆయన చివరి చిత్రం.
రవి భార్య థంకమ్మ గతంలోనే చనిపోయింది. దీంతో రవి డిసెంబర్ 2022లో ఇడుక్కి శివార్లలోని మరయూర్ అనే గ్రామానికి మారాడు. తన అనారోగ్యం కారణంగా తన కుమార్తె కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఆయనకు కుమార్తె లక్ష్మి, కుమారుడు హరి, మనుమలు ఉన్నారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేరళ సీఎం పినరయిన్ విజయ్.. రవి ఆత్మకు శాంతి చేకూరాలంటూ.. సంతాపం తెలియజేశారు. అలానే రాష్ట్ర మంత్రి వి శివన్ కుట్టి.. రవి గురించి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరి.. సీనియర్ నటుడు రవి మృతికి సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.