తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. ప్రాణాలు తీసిన ఒంటె!

తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. ప్రాణాలు తీసిన ఒంటె!

తాగేందుకు నీళ్లు పెడుతుండగా.. ప్రాణాలు తీసిన ఒంటె!

చాలా మంది మూగ జీవాలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. మరికొందరు పాడి పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వాటికి బలమైన ఆహారం, నీరు అందిస్తూ ఎంతో అపురూపంగా  చూసుకుంటారు. అలానే ఆ పెంపుడు జంతువులు కూడా తమ యజమాని పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. తమ యజమాని చెప్పినట్లు వింటూ, వారి పనుల్లో సాయ పడుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెంపుడు జంతువుల కారణంగానే ప్రాణాలు పోతుంటాయి. తాజాగా ఎంతో ప్రేమగా పెంచుకున్న  ఓ ఒంటే యజమాని ప్రాణం తీసింది. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలోని సస్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒస్గోయ్ గ్రామంలో  బఘేల్,తోతా దేవి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా కాలం నుంచి ఆ దంపతులు ఓ ఒంటెను పెంచుకుంటున్నారు. ఆ ఒంటెకు కడుపు నిండ ఆహారం పెడుతూ ఎంతో అపురూపంగా చూసుకునే వారు. ఆహారం పెట్టిన అనంతరం వారే స్వయంగా వెళ్లి ఆ ఒంటెకు నీళ్లు అందించే వారు. అలా చాలా ఏళ్ల నుంచి ఆ ఒంటెను పోషిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం మధ్యాహ్నం కూడా ఒంటెకు నీళ్లు పెట్టేందుకు తోతా దేవి వెళ్లారు. అదే సమయంలో ఆమెపై అది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

ఆమె గొంతును నోటితో కరచుకొని.. రెండు దవడలతో పీక నొక్కేసింది. దేవి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే తోతా దేవి మృతి చెందారు. ఒంటె.. ఆమె గొంతును బలంగా నొక్కడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమానినే పొట్టన పెట్టుకోవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తోతాదేవి మృతితో వారిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాను పెంచుకునే పెంపుడు జంతువే.. ప్రాణం తీస్తుందని దేవి ఊహించ లేదు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments