Dharani
Dharani
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా, మీడియాలో తమన్నా గురించి బోలేడు వార్తలు వస్తున్నాయి. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితం ఇలా వీటన్నింటికి సంబంధించి నిత్యం ఏదో వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. సినిమాల్లో బోల్డ్ సీన్స్లో రెచ్చిపోవడం.. బయట చూస్తే.. లవ్ లైఫ్.. ఇలా మూడు వార్తలు.. ఆరు గాసప్పులుగా సాగుతోంది తమన్నా కెరీర్. ఇక ఈ మధ్య కాలంలో తమన్నాకు సంబంధించి ఒక వార్త వివపరీతంగా వైరల్ అయ్యింది. మెగా కోడలు ఉపాసన.. తమన్నాకు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ను గిఫ్ట్గా ఇచ్చిందనేది ఆ వార్తల సారాశం. సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా నటనకు ఫిదా అయిన ఉపాసన ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిందట. అంతేకాక ఉపాపస.. మిల్కీ బ్యూటీకి ఇచ్చిన ఈ డైమండ్ ప్రపంచంలో ఉన్న పెద్ద డైమండ్లలో ఐదవదంటూ వార్తలు వచ్చాయి. పైగా ఇందకు సంబంధించి.. వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ స్క్రీన్ షాట్స్ కూడా ఉండటంతో ఈ వార్త విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ వార్తలు కాస్త తమన్నా చెవిన పడ్డాయి. దాంతో ఆమె వెంటనే ఈ వార్తలపై స్పందించారు. ఉపాసన నాకు 2 కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ వస్తోన్న వార్తలు వాస్తవం కాదు. ఫొటోలో నేను ధరించింది డైమండ్ కాదు.. బాటిల్ ఒపెనర్. మేం దానితో ఫొటో షూట్ చేశాం. ఒపెనర్ డిజైన బాగుంది కదా అని ఇలా ఫొటోలకు ఫోజ్ ఇచ్చాను. అంతే ఇది డైమండ్ కాదు అని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ వార్తలపై ఒక క్లారిటీ వచ్చింది. అయినా సైరా సినిమా విడుదలయ్యింది 2019లో.. ఒకవేళ నిజంగానే ఉపాసన గిఫ్ట్ ఇచ్చింది అనుకున్నా.. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ వార్త మళ్లీ వెలుగులోకి వచ్చింది అని చర్చించుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తాజాగా తమన్నా లస్ట్ స్టోరీస్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్లో నటించడంతో తమన్నాపై బోలేడు విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటిస్తోంది. అలానే తెలుగులో భోళా శంకర్ సినిమాలో చేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.