మణిపూర్‌లో మరో ఘోరం! స్వాతంత్య్ర సమర యోధుడి భార్య సజీవ దహనం

మణిపూర్‌లో మరో ఘోరం! స్వాతంత్య్ర సమర యోధుడి భార్య సజీవ దహనం

మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో తెగల మధ్య అల్లర్లు జరుగుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఆ అల్లర్లలో జరుగుతున్న ఘోరాలు బయటి ప్రపంచానికి తెలియదు. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడిన వీడియోలు వైరల్‌ కావడంతో దేశం ఉలిక్కిపడింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి.

మణిపూర్‌ అల్లర్లపై ఇన్నాళ్లు మౌనం వహించిన ప్రధాని మోదీ సైతం.. దీన్ని అమానవీయ ఘటనగా, దేశం సిగ్గుతో తలదించుకున సంఘటన పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగక ముందే మరో దారుణం వెలుగు చూసింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పోరాటం చేసిన ఓ యోధుడి భార్యను సజీవ దహనం చేశారు. మే 28న కక్చింగ్‌ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమద యోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో కొంతమంది ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆమె ఆ మంటల్లో కాలి బూడిదైంది.

ఆమెను రక్షించేందుకు ఆమె మనవడు ప్రేమకంఠ(22) ప్రయత్నించగా అల్లర్లకు పాల్పడిన మూక అతనిపై కాల్పులు జరిపారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన ప్రేమకంఠ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక్కొక్కటిగా ఇలా దారుణాలు బయటి వస్తుండటంతో ప్రపంచానికి తెలియకుండా ఇంకా ఘోరాలు జరిగాయో ఊహించుకుంటేనే ఒళ్లు ఝలదరిస్తోంది. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: దారుణం: గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల చిన్నారి మృతి

Show comments