Tragedy Took Place in Bowenpally: విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి తండ్రి బలవన్మరణం!

విషాదం.. ఇద్దరు కూతుర్లను చంపి తండ్రి బలవన్మరణం!

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది చనిపోతున్నారు. దాంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన పిల్లల పరిస్థితి దారుణంగా మారుతుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అనారోగ్యంతో బాధపడటం ఇలా ఎన్నో కారణాల వల్ల డ్రిపేషన్ లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ లో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవానీ నగర్ లో కుటుంబ కలహాలతో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. శ్రీకాంతా చారి (42) గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై తన ఇద్దరు కూతుళ్లు శ్రావ్య (7),స్రవంతి(8) కు నిద్రమాత్రలు ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఉదయం శ్రీకాంత్ భార్య వారిని లెపగా ఎంతకీ నిద్ర లేవకపోవడంతో స్థానికులను పిలిచి చూడగా అప్పటికే శ్రీకాంత్, ఇద్దరు కూతుళ్లు చనిపోయి ఉన్నారు. ఒకేసారి కుటుంబంలో ముద్దురు చనిపోవడంతో భవానీ నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

శ్రీకాంత చారి ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయాడా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు. నిన్నటి వరకు తన భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నారని.. ఎన్ని సమస్యలు వచ్చినా తనకు ధైర్యం చెప్పేవాడని.. అలాంటిది పిల్లలతో ఇలా ఆత్మహత్య చేసుకుంటాని ఊహించలేదని శ్రీకాంత్ సతీమణి కన్నీరు మున్నీరవుతుంది. అప్పటి వరకు అందరితో ఆనందంగా ఉన్న శ్రీకాంత్, ఇద్దరు చిన్నారులు లేరన్న వార్త విని భావానీ నగర్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Show comments