Bengaluru Crime News: అందమే ఆమెకు శాపంగా మారింది.. అనుమానంతో భర్త దారుణం!

అందమే ఆమెకు శాపంగా మారింది.. అనుమానంతో భర్త దారుణం!

Bengaluru Crime News: ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ఒకరిపై ఒకరి అనుమానాలు పెనుభూతంగా మారి చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి.

Bengaluru Crime News: ఇటీవల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ఒకరిపై ఒకరి అనుమానాలు పెనుభూతంగా మారి చివరికి హత్యల వరకు వెళ్తున్నాయి.

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం, హత్యలకు తెగబడటం జరుగుతుంది. చాలా వరకు భార్యాభర్తల మధ్య అనుమానాలు, అపోహలు ఒక కారణం అయితే ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యలు కారణం అంటున్నారు. ఈ మధ్య కాలంలో భార్యాభర్త మద్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి హత్యలకు దారి తీస్తున్నారు. ఓ మహిళకు అందమే శాపంగా మారింది. పెళ్లైనప్పటి నుంచి భర్త అనుమానాం ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

కృష్ణరాజపురం నగరంలోని కోరమంగళలో భార్యను నడి రోడ్డు పై దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో భర్తను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సీ కె బాబా తెలిపిన వివరా ప్రకారం ఈ నెల 2న కోరమంగళ పరిధిలోని వెంకటపురం లో హత్య జరిగింది. ఇందు (28) అనే మహిళను ఆమె భర్త మైకేల్ ఫ్రాన్సిస్ (33) హత్య చేశారు. ఇందు రిటైల్ కిరాణా చైన్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది.గత కొంత కాలంగా ఇందు, మైకేల్ మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంతా ఇందు వెంకటాపురలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. ఫ్రాన్సిస్, ఇందు దంపతులకు 12 ఏళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.స్థానికంగా కార్పెంటర్ పని చేస్తున్నాడు ఫ్రాన్సిస్. గత కొంత కాలంగా ఫ్రాన్సిస్ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. అంతేకాదు అందమైన తన భార్యపై ఫ్రాన్సిస్ అనుమానం పెంచుకున్నాడు.

ఇందుని అనుమానిస్తూ ఆమెతో తరచూ గొడవపడేవాడు. భర్త వేధింపులు భరించలేక పిల్లలతో కలిసి ఆరు నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే మే 2వ తేదీ భార్య వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. తనతో కలిసి ఇంటికి రావాాలని కోరాడు. ఇందు మాత్రం ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడైన ఫ్రాన్సిస్  తనతో తెచ్చుకున్న కత్తితో భార్యను రోడ్డుపై పొడిచి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ సంఘటనపై ఇందు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని భర్త ఫ్రాన్సిస్ కోసం గాలింపు మొదలు పెట్టారు. మొత్తానికి కిరాతక భర్తను అరెస్ట్ చేసినట్లు డీసీపీ బాబా తెలిపారు.

Show comments