Dharani
Elections 2024: మండే ఎండల్లో వండర్లా అదిరిపోయే చిల్లింగ్ ఆఫర్ ప్రకటించింది. భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఆ వివరాలు..
Elections 2024: మండే ఎండల్లో వండర్లా అదిరిపోయే చిల్లింగ్ ఆఫర్ ప్రకటించింది. భారీ ఎత్తున డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
ఈ రెండు రోజుల నుంచి అంటే.. కాస్త చల్లబడింది కానీ.. గత వారం వరకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపించాయి. గతంలో ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 47 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదయ్యింది అంటే.. భానుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం చల్లని టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అంత బడ్జెట్ లేని వాళ్లు.. లోకల్గా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో నగర వాసులు వాటర్ పార్క్లకు క్యూ కడుతున్నారు.
ఇక వాటర్ పార్క్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది వండర్లా. సాధారణ రోజుల్లోనే ఇక్కడ విపరీతైమన రద్దీ ఉంటుంది. అలాంటిది ఇక సెలవులు.. వేసవిలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యాత్రికులను ఆకట్టుకోవడం కోసం వండర్లా అప్పుడప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బంపరాఫర్ ప్రకటించింది వండర్లా. అన్ని రకాల టికెట్ల మీద భారీ ఎత్తున డిస్కౌంట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఈ ఆఫర్ అందరికి వర్తించదు. ఆ వివరాలు..
వండర్లా భారీ బంపరాఫర్ ప్రకటించింది. దీని ద్వారా ఇటు కస్టమర్లను ఆకర్షించడమే కాక.. అటు ఓటు హక్కు వినియోగం మీద అవగాహన కల్పించినట్లుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించింది. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఓటు హక్కు వినియోగించుకున్న వారికి టికెట్స్పై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ వండర్లా యాజమాన్యం ప్రకటించింది. అంతేకాక ఈ ఆఫర్ మూడు రోజుల పాటు అనగా 13, 14, 15 తేదీల్లో కూడా వర్తిస్తుందని వండర్లా యాజమాన్యం వెల్లడించింది.
మే 13న ఓటు వేసిన వారు మూడు రోజుల పాటు ఈ డిస్కౌంట్ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. ఎలక్షన్లో ఓటు వేసిన వారు.. ఇంకు గుర్తు చూపి.. ఈ ఆఫర్ను పొందవచ్చు. కేవలం ఎంట్రీ టికెట్ల మీదనే కాక.. ఫుడ్ కాంబోలపై కూడా 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్లు కొనే వారు ఇరువురుకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రజలందరూ ఓటు వేసి.. ఈ ఆఫర్ను ప్రకటించుకోవాలని హైదరాబాద్ వండర్లా వెల్లడించింది.
ఇదే కాక మేలో బర్త్డే ఉన్న వారి కోసం వండర్లా ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మే నెలలో జన్మించిన వారికి ఒక వండర్లా టికెట్ కొంటే.. మరొకటి ఉచితంగా ఇవ్వనున్నారు. 2024, మే 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారికి కూడా వండర్లా ఒక ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఎస్ఆర్టీసీ బస్సులో వండర్లా వెళ్లే వారికి ఎంట్రీ టికెట్పై 15 శాతం తగ్గింపు పొందవచ్చు.