పోలవరం ప్రాజెక్టులో మరో ముందడుగు , పూర్తయిన గ్యాప్ 3 డ్యామ్

పోలవరం ప్రోజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దాంతో పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం కూడా పూర్తయ్యింది.

కీలకమైన గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పనులను పూర్తి చేయడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్ద చేసిన కృషి సకాలంలో ఫలించింది.153.50 మీ పొడవు, 53.320మీ ఎత్తు,8.50 మీ వెడల్పుతో గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తి చేశారు.స్పిల్ వే నుండి ఈసిఆర్ఎఫ్ డ్యాంకు అనుసంధానం చేయడానికి గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం కీలకం. పోలవరం హెడ్ వర్క్స్ లో ఈసిఆర్ఎఫ్ డ్యాంలలో గ్యాప్-3 ఒకటి. గ్యాప్-1,గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ లు రాక్ ఫిల్ ఢ్యాంలు కాగా గ్యాప్-3 మాత్రం కాంక్రీట్ డ్యాంగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాప్-3 కాంక్రీట్ ఢ్యాం నిర్మాణానికి దాదాపు 23000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించి పూర్తి చేశారు.

Also Read:పోలవరం పనులు జరగటం లేదా?కళ్ళు తెరిచి చూడండి దేవినేని ఉమా గారు..

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుని ఈ గ్యాప్ 3 చాటుతోంది. ఈ ఏడాది జూన్ లోనే స్పిల్ వే గుండా నీటిని మళ్లించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. దాంతో గ్యాప్ 3 నిర్మాణం ద్వారా ఈసిఆర్ఎఫ్ పనులు మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.ఓవైపు వరదలు మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులున్నా లక్ష్యం దిశగా పనులు సాగుతున్న తీరుని ఇది తేటతెల్లం చేస్తోంది.

మేఘా ఇంజనీరింగ్ సంస్ద 2019 నవంబర్ లో పనులు చేపట్టింది. కీలకమైన పోలవరం స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తైంది. స్పిల్ వే లో 3,32,295 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేయడం జరిగింది అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48రేడియల్ గేట్లకు గానూ 42గేట్లను అమర్చడం జరిగింది. మిగిలిన 6గేట్లను త్వరలోనే అమర్చనున్నట్టు చెబుతున్నారు. రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84సిలిండర్లను అమర్చారు.ఇప్పటికే 24పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ లు అమర్చారు.10రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. స్పిల్ ఛానెల్ లో 241826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.స్పిల్ ఛానెల్ లో 35లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.

Also Read : ‘గద్దె’ చెబుతున్న చంద్రబాబు ఘన చరిత్ర

దీనికి తోడు స్పిల్ ఛానెల్ లో కీలకమైన 1391మీటర్ల పొడవైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణ పనులు సైతం పూర్తి అయ్యాయి.ఇంక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం.కీలకమైన ఎగువ,దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఎగువ కాఫర్ డ్యాం లో 33,73,854, క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి.ఇప్పటికే ఎగువ కాఫర్ ఢ్యాం ను2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు కు గానూ పూర్తి స్దాయి ఎత్తున నిర్మాణం పూర్తి అయింది.దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం సైతం దాదాపు 21మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తి అయింది.దిగువ కాఫర్ ఢ్యాంలో ఇప్పటికే 3,15,237 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి.ఇటీవలే ఎగువ కాఫర్ ఢ్యాం దగ్గర అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్ళించడం పూర్తైంది.

గ్యాప్2లో ఈసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. 
అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. గ్యాప్-1లో 400మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తి అయింది.గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా,కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి.కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయ్యాయి.ఇప్పటికే 20,31491 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జోరందుకున్నాయి. దాంతో పోలవరం విషయంలో ప్రతిపక్షాల వాదనలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం పనుల్లో పురోగతి దిశగా సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. 

Also Read : బుచ్చయ్య ఎపిసోడ్‌లో కొత్త వివాదం.. ఎవరు లోకల్‌..? ఎవరు నాన్‌లోకల్‌..?

Show comments