Idream media
Idream media
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ రోజు ఆయన తన తనయుడుతో కలసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాలనికి వచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులపై సీఎం జగన్, ముకేష్ అంబానీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ ఇంకా కొనసాగుతోంది.
రాష్ట్రం నుంచి పెట్టుబడులు తర లిపోతున్నాయంటూ ఈ మధ్య టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కియాపై చిన్నపాటి తుఫాననే సృష్టించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్తో ముకేష్ అంబానీ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ముకేష్ అంబానీ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబుతో 2018లో భేటీ అయిన విషయం తెలిసిందే.
Read Also : ఈ సారి మండల, జిల్లా పరిషత్లకూ కేంద్రం సొమ్ములు