అనంత్ పెళ్లిలో నీతా అంబానీ చేతిలో వెరైటీ దీపం… దీని వెనుక స్టోరీ ఇదే?

Nita Ambani: శుక్రవారం ప్రపంచస్థాయి ప్రముఖల, సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్లు అందరూ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే...వివాహనికి ముందు నీతా అంబానీ చేతిలో వెరైటీ దీపం కనిపించింది.

Nita Ambani: శుక్రవారం ప్రపంచస్థాయి ప్రముఖల, సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్లు అందరూ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే...వివాహనికి ముందు నీతా అంబానీ చేతిలో వెరైటీ దీపం కనిపించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ముకేశ్ అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుకే హాట్ టాపిక్ గా ఉంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహం ఎంతో ఆడంబరంగా , అత్యంత వైభవంగా జరిగింది. విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం 100కు పైగా ఫ్లైట్ లను అరేంజ్ చేశారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్లు అందరూ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే…వివాహనికి ముందు నీతా అంబానీ చేతిలో వెరైటీ దీపం కనిపించింది. అసలు అది ఏమిటా అని చాలామందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ దీపం గురించి ఓ స్టోరీ వైరల్ అవుతోంది.

శుక్రవారం ప్రపంచస్థాయి ప్రముఖల, సెలబ్రిటీల మధ్య అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో జరిగిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ వివాహ వేడుకకు ముందు కుటుంబంతో కలిసి పెళ్లి మండపం వద్దకు ముకేశ్ కుటుంబం వెళ్లింది. ఆ సమయంలో ముకేశ్ సతీమణి నీతా అంబానీ చేతిలో ఉన్న ఓ వస్తువు అందరిని ఆకర్షించింది. అది రామన్‌ దివో అనే ప్రత్యేకమైన దీపం. దీనిపై గణేశుడి ప్రతిమ దర్శనమిచ్చింది. ఇది గుజరాతీ పెళ్లిళ్లిలో ఈ రామన్ దివ్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి వేదిక వద్దకు వరుడు వెళ్లే సమయంలో అతడి తల్లి  ఆ వస్తువును తనవెంట తీసుకవస్తుంది. ఈ ల్యాంప్ ను శుభసూచికంగా భావిస్తారు. అది చీకటిని పారద్రోలి, నూతన దంపతులకు  ఆశీస్సులు అందిస్తుందని బలంగా నమ్ముతారు.

ఇక తన చిన్నకుమారుడి వివాహ వేడుకలో నీతా అంబానీ ఉద్వేగానికి గురైంది. ఈ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘నా పిల్లలు శాశ్వత బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని చూస్తుంటే.. నా మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతేకాక దైవ భక్తితో ఉప్పొంగుతోంది. హిందూ సంప్రదాయంలో వివాహం అనేది  కేవలం ఈ జన్మకు మాత్రమే సంబంధించినది కాదు. అది ఏడు జన్మలకు చేసుకునే వాగ్దానం” అని అతిథులను ఉద్దేశించి నీతా అంబానీ తెలిపారు.

శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లో వివాహం అంగరంగం వైభవంగా జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకకు దాదాపు 5వేల కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. మొత్తంగా నీతా అంబానీ చేతిలోని ప్రత్యేక ప్రతిమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments