గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీని మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినీ పరిశ్రమలో చోటుచేసుకునే విషాదాల సంఖ్య తగ్గడం లేదు. కొన్ని రోజుల క్రితం నటుడు శరత్ బాబు, కన్నడ నటుడు నితిన్ గోపీ, డైరెక్టర్ వెట్రిమారన్ అసిస్టెంట్ శరన్ రాజ్ లతో పాటు మరికొందరు నటీ, నటులు మరణించారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య కారణంతో మరణించారు. ఈ మరణవార్తల నుంచి తేరుకోకముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ మరణించిన వార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెున్న శరత్ బాబు, నిన్న రాకేష్ మాస్టర్.. నేడు ప్రముఖ సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు (72) మరణించారు. వయసు సంబంధిత సమస్యలతోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వరరావు తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆయన పనిచేసిన చిత్రాల్లో.. మెుండి మెుగుడు పెంకి పెళ్ళాం, యుగంధర్, ముద్దాయి, కెప్టెన్ కృష్ణ, ఇద్దరు అసాధ్యులు లాంటి మరెన్నో చిత్రాలకు ఆయన ఎడిటర్ గా వర్క్ చేశారు. దాదాపు 200ల చిత్రాలకు పైగా ఆయన ఎడిటర్ గా వర్క్ చేశారు. ఈ నెల 22వ తేదీన వెంకటేశ్వర రావు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.