Raj Tarun Issue: రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు సంచలన వ్యాఖ్యలు.. ఆ హీరోయిన్‌ నన్ను చంపుతానని బెదిరించింది

రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు సంచలన వ్యాఖ్యలు.. ఆ హీరోయిన్‌ నన్ను చంపుతానని బెదిరించింది

Raj Tarun Issue: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించిన సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Raj Tarun Issue: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించిన సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బుల్లితెరపై షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోగా మారిన యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. షార్ట్ ఫిలిమ్ మూవీ మేకర్ గా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని చూశాడు. కానీ అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’ మూవీలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ మూవీస్ తో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో ప్రస్తుతం ఎలాంటి పాత్రలకైనా ఓకే చెబుతున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్పుడప్పుడు పలు వివాదాస్పద వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి రాజ్ తరుణ్ వార్తల్లో నిలిచారు. ఆయన ప్రేయసి లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించాడని.. చాలా కాలం తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని తెలిపింది. తనని పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఇప్పుడు ముఖం చాటేసి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.తాము ఇద్దరం విడిపోవడానికి ఓ సినీ నటి కారణం అని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. కొంత కాంగా  మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని, అందుకే తనను వదిలేశాడంటూ చెబుతోంది. ప్రస్తుతం మాల్వీ మల్హోత్ర ‘తిరగబడర సామి’ మూవీలో నటిస్తుంది.  ఆ నటితో పాటు ఆమె సోదరుడిపై కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

రాజ్ తరుణ్ తనతో ఎంతో సంతోషంగా ఉండేవాడని.. ఆ నటి తమ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా మారిపోయిందని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ నటి తమ మధ్య చిచ్చు పెట్టడమే కాదు.. అతన్ని మర్చిపోకుంటే చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని పలుమార్లు బెదిరిస్తూ ఫోన్ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. విశాఖపట్నంలో తాను షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న సమయంలో ప్రేమించుకున్నామని.. 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నామని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య తెలిపింది. ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ నటితో సంబంధం పెట్టుకున్నాడని.. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి దూరంగా ఉంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ నటి వల్ల తనకు ప్రమాదం ఉందని.. ఆ భయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య తెలిపింది. కాకపోతే ఆ నటి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

Show comments