ఘోరం: కన్న కొడుకుని పొడిచి చంపి ఉడకబెట్టి తిన్న తల్లి!

సమాజంలో రోజుకొక దారుణం వెలుగులోకి వస్తుంది. కొందరు తల్లిదండ్రులు విచక్షణ మరిచి కన్నవాళ్లను కూడా కాటికి పంపుతున్నారు. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ తల్లి కన్న కొడుకుని అతి కిరాకతంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఇంతటితో సరిపెట్టని ఆ మహిళ.. కొడుకు శవాన్ని ఉడకపెట్టి తినేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మీడియా కథనం ప్రకారం.. ఈజిప్టులోని ఫకస్ ప్రాంతంలో హనా మహ్మద్ హసన్ అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తన 5 ఏళ్ల కుమారుడితో ఉంటుంది. కాగా అప్పటి నుంచి హనా మానసిక రుగ్మాతతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ మహిళ ఇటీవల ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తన కుమారుడిని కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసింది.

ఇంతే కాకుండా హనా.. ఆ చిన్నారి తల, మొండాన్ని వేరు చేసింది. ఆ తర్వాత కొడుకు మృతదేహాన్ని ఉడకబెట్టి తినేసింది. ఇదే విషయం స్థానికులకు తెలిజేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హనా మహ్మద్ హసన్ అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె చేసిన దారుణాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Show comments