మహేష్‌ బాబు ఇంట విషాదం.. సితార, నమ్రత ఎమోషనల్‌

మహేష్‌ బాబు ఇంట విషాదం.. సితార, నమ్రత ఎమోషనల్‌

మహేష్‌బాబు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ మహేష్‌ కుమార్తె సితార, ఆయన భార్య నమ్రత ఎమోషనల్‌ అయ్యారు. మరి ఇంతకు ఏం జరిగింది అంటే.. సితార.. గత ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క.. ఫ్లూటో చనిపోయిందట. ఇక ఫ్లూటోతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సితార, నమ్రత ఎమోషనల్‌ అయ్యారు. దానితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ క్రమంలో సితార.. తన పెట్‌ ఫ్లూటోతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఏడేళ్ల బంధం.. మిస్‌ యూ అంటూ పోస్ట్‌ చేస్తూ.. భావోద్వేగానికి గురయ్యింది. చిన్న పిల్లలు జంతువులను ఎంతలా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటికి చిన్న గాయం అయితేనే కొందరు పిల్లలు ఇళ్లు పీకి పందిరేస్తారు. తమ పెట్స్‌ కోలుకునే వరకు బాధపడతారు. సితార కూడా తన పెట్‌ ఫ్లూటో మీద అలాంటి ప్రేమనే పెంచుకుంది. ఏడేళ్లు తనతో ఉన్న పెట్‌ కన్నుమూయడంతో చాలా బాధపడుతోంది. ఇక కుమార్తె బాధ చూసి నమ్రత ఓదార్చే ప్రయత్నం చేశారు.

‘‘మన ప్రార్థనల్లో ఫ్లూటో ఎప్పటికి బతికే ఉంటుంది.. నిన్ను మిస్‌ అవుతాం ఫ్లూటో.. మా హృదయాల్లో మాత్రం ఎప్పటికి నిలిచే ఉంటావు’’ అంటూ నమ్రత కూడా ఫ్లూటో ఫొటోలను షేర్‌ చేసింది. కుక్క చనిపోతే ఇంత హడావుడి అవసరమా.. అని కొందరు అంటుంటే.. మీరు పెట్‌ లవర్‌ అయితే ఆ బాధ ఎలా ఉండేదో మీకు తెలిసేది.. కుక్క అయినంత మాత్రాన అది జీవి కాదా.. పైగా మనుషుల్లా కాకుండా ఎంతో నిస్వార్థంగా మనపై ప్రేమను, విశ్వాసాన్ని చూపుతుంది అంటున్నారు నెటిజనులు.

Show comments