Mahalakshmi Is Enjoying With Photoshoots: భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?

భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?

  • Author singhj Published - 06:29 PM, Thu - 21 September 23
  • Author singhj Published - 06:29 PM, Thu - 21 September 23
భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?

నటి మహాలక్ష్మీ-నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గురించి వినే ఉంటారు. కోలీవుడ్​లో వీళ్లు వెరీ పాపులర్ కపుల్. మహాలక్ష్మీ-రవీందర్ కలసి ఫొటో దిగినా, వీడియోలు షేర్ చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతాయి. వీళ్లు ఆదర్శ దంపతులని కొందరు కితాబిస్తే.. మరికొందరు మాత్రం డబ్బుల కోసమే రవీందర్​ను మహాలక్ష్మీ పెళ్లాడిందని విమర్శిస్తుంటారు. అయితే ఈ కపుల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. అయితే ఇటీవల చీటింగ్ కేసులో రవీందర్ అరెస్ట్ అయ్యారు.

చీటింగ్ కేసులో అరెస్టైన రవీందర్ ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన భార్య మహాలక్ష్మీ చేసిన ఒక పనిపై నెట్టింట తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు భర్త జైల్లో ఉంటే నటి మాత్రం వరుస ఫొటోషూట్లతో బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో అభిమానులతో పంచుకోవడం గమనార్హం. ‘అంతా మంచే జరుగుతుంది. నా హృదయం నీ కోసమే వేచిచూస్తోంది’ అంటూ ఆ పోస్టులకు ఆమె క్యాప్షన్ జోడించారు. క్యాప్షన్ బాగానే ఉన్నా మహాలక్ష్మీ ఫొటోషూట్, అందులో ఆమె నవ్వుతూ కనిపించడం చూస్తే ఏదో తేడాగా ఉందంటున్నారు నెటిజన్స్.

రవీందర్​ను మహాలక్ష్మీ డబ్బుల కోసమే పెళ్లాడిందని.. ఇప్పుడు కావాలనే ఆయన్ను జైలుకు పంపించిందని కొందరు సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే మహాలక్ష్మీపై వస్తున్న ఆరోపణలను ఆమె అభిమానులు తిప్పికొడుతున్నారు. వీరు చాన్నాళ్లుగా లవ్ చేసుకున్నప్పటికీ మ్యారేజ్ మాత్రం గతేడాది జరిగిందని.. అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్ గురించి అగ్రిమెంట్ చేసుకున్నారని అంటున్నారు. అయితే అసలు నిజం ఏంటనేది మహాలక్ష్మీ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.

కాగా, వ్యర్థాల నుంచి విద్యుత్​ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్​తో కోట్లు సంపాదించొచ్చంటూ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని రవీందర్ నమ్మబలికించాడట. నకిలీ పత్రాలను సిద్ధం చేసి అతడి వద్ద నుంచి రూ.15 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడట. ఈ ఒప్పందం 2020 సెప్టెంబర్ 17న జరిగిందని సమాచారం. అయితే డబ్బులు అందిన అనంతరం ఈ ప్రాజెక్ట్​ను రవీందర్ పక్కన పడేశాడట. తన డబ్బులు తనకు తిరిగివ్వాలని కోరినప్పటికీ అతడు సరిగ్గా స్పందించలేదట. దీంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్​లో బాలాజీ ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లయింట్ మేరకు రవీందర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: దారుణంగా మారిపోయిన చరణ్​ హీరోయిన్!

Show comments