Manipur: మణిపూర్‌: మహిళల నగ్న ఊరేగింపు ఘటనలో ప్రధాన నిందితుడి ఇల్లు దగ్ధం!

మణిపూర్‌: మహిళల నగ్న ఊరేగింపు ఘటనలో ప్రధాన నిందితుడి ఇల్లు దగ్ధం!

గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఒక తెగకు చెందిన ఇద్దరు మహిళలను మరో తెగకు చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు, సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ ఘటనపై మండిపడ్డారు. రెండు నెలలుగా మణిపూర్‌ అల్లర్లపై మాట్లాడని ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు.

మోదీ మాట్లాడుతూ.. ఇదోక అమానవీయ ఘటనగా పేర్కొన్నాడు. కొంతమంది చేసిన పనికి దేశంలోని 140 కోట్ల మంది సిగ్గుతో తలదించుకుంటున్నారని భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారిని విడిచిపెట్టం అంటూ హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ఘటన వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడు హీరాదాస్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆ వీడియాలో ఆకుపచ్చ రంగు టీషర్ట్‌ ధరించి ఉన్న వ్యక్తే ఈ హీరాదాస్‌. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తూ.. ఘటనలో పాల్గొన్న మరికొంతమంది నిందితుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కాగా, హీరాదాస్‌ వివరాలు తెలియడంతో గుర్తు తెలియని వ్యక్తులు పేచీ అవాంగ్‌ లైకైలో ఉన్న అతని ఇంటిని తగలబెట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం ఏం జరగలేదు. నీచుకుడికి తగిన శాస్తి జరిగిందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విపక్ష కూటమిపై పోలీస్ కేసు! 26 పార్టీలపై..

Show comments