Saichand Wife: తెలంగాణ ఫోక్ సింగర్ సాయిచంద్ భార్యకు తీవ్ర అస్వస్థత!

Saichand Wife: తెలంగాణ ఫోక్ సింగర్ సాయిచంద్ భార్యకు తీవ్ర అస్వస్థత!

  • Author singhj Published - 12:56 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 12:56 PM, Tue - 4 July 23
Saichand Wife: తెలంగాణ ఫోక్ సింగర్ సాయిచంద్ భార్యకు తీవ్ర అస్వస్థత!

ప్రముఖ ఫోక్ సింగర్, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. జానపద గీతాలు పాడటంలో సాయిచంద్ మంచి పేరు సంపాదించారు. తెలంగాణ ఉద్యమం టైమ్​లో ఆయన పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్​గా ఆయన పనిచేశారు. కుటుంబంతో కలసి కారుకొండలోని తన ఫామ్​హౌస్​లో ఉన్న టైమ్​లో ఆయనకు గుండెనొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సాయిచంద్​ను నాగర్​కర్నూల్​లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన ట్రీట్​మెంట్ కోసం హైదరాబాద్​లోని కేర్​ హాస్పిటల్​లో చేర్పించారు.

సాయిచంద్​ను బతికించడానికి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్తతో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఉద్యమకారులు, ప్రజలు షాక్​కు గురయ్యారు. సాయిచంద్ కన్నుమూసి ఇంకా వారం కూడా కాలేదు. ఆయన లేరనే బాధను కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టైమ్​లో సాయిచంద్ సతీమణి రజని తీవ్ర అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకరంగా మారింది. సోమవారం సాయంత్రం ఆమెకు ఒక్కసారిగా హార్ట్ ఎటాక్​ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే రజనీని గుర్రంగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారని తెలుస్తోంది.

సాయిచంద్ భార్య రజనీకి డాక్టర్లు ట్రీట్​మెంద్ అందిస్తున్నారని తెలిసింది. ఆమె హెల్త్ కండీషన్ ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న రజనీ గుండెలవిసేలా ఏడుస్తున్నారు. కొన్ని రోజులుగా ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో గుండె నొప్పి రావడంతో బీఎన్​రెడ్డి నగర్​లోని కోణార్క్ డయాగ్నస్టిస్ సెంటర్​కు ఆమెను తీసుకెళ్లారట. భర్తను పోగొట్టుకున్న బాధలో ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఆమె నీరసించిపోయారట. తీవ్ర ఒత్తిడితో రజినీకి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అస్వస్థతకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Show comments