ప్రియురాలు వేరే అబ్బాయితో మాట్లాడుతుందని షాకింగ్ నిర్ణయం!

ప్రియురాలు వేరే అబ్బాయితో మాట్లాడుతుందని షాకింగ్ నిర్ణయం!

ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రేయసి వేరే అబ్బాయితో మాట్లాడుతుందని తట్టుకోలేకపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రేయసి వేరే అబ్బాయితో మాట్లాడుతుందని తట్టుకోలేకపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నేటి రోజుల్లో ప్రేమ వ్యవహారాలు దారుణాలకు దారితీస్తున్నాయి. పరిచయాలు స్నేహాలుగా మారి, ఆ తర్వాత ప్రేమికులుగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా తయారవుతున్నారు. ఈ క్రమంలో తమకిష్టమైన ప్రియుడు లేదా ప్రియురాలు దక్కకపోతే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమ మాటున జరిగే మోసాలు కూడా అన్నీ ఇన్నీ కావు. కొందరు యువతీ యువకులు ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇది తెలిసిన తర్వాత వారి లవ్ బ్రేకప్ అవ్వడం.. ఆతర్వాత తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఓ ఐటీ ఉద్యోగి తన ప్రియురాలు వేరే అబ్బాయితో మాట్లాడుతూ తనను పట్టించుకోవట్లేదని ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

ప్రేమలో ఉన్నప్పుడు ప్రియుడు లేదా ప్రియురాలి నుంచి కాల్, మెసేజ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అస్తమానం ఫోన్ వైపు చూస్తూ ఉంటారు. సడన్ గా తమ లవర్ నుంచి మెసేజ్ వస్తే చాలు తెగ సంబరపడిపోతుంటారు. ఒక వేళ మెసేజ్ కానీ, ఫోన్ కాల్ గానీ రాకపోతే ప్రాణం పోయినట్టుగా ఫీలవుతుంటారు. ఇదే విధంగా ఓ యువకుడు తన ప్రేయసిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు. కొంత కాలం వరకు వారి మధ్య ప్రేమ బాగానే కొనసాగింది. ఆ తర్వాత ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో చనువుగా ఉండడం స్టార్ట్ చేసింది. దీంతో ఆ యువకుడు తనను ప్రియురాలు పట్టించుకోవడం లేదని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

హైదరాబాద్ – రాజేంద్రనగర్ పరమ రెడ్డి హిల్స్ లో ఉండే ఐటీ ఉద్యోగి ఇమ్రోస్ పటేల్(28) అనే యువకుడు అనుష్క అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో కలిసి జీవించాలని అనుకున్నాడు. పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్దమయ్యాడు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న వారి ప్రేమలో మూడో వ్యక్తి వచ్చి చేరాడు. ఇమ్రోస్ ప్రేమించిన యువతి వేరే అబ్బాయితో చనువుగా ఉండడం ప్రారంభించింది. దీంతో అనుష్క అతడిని పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో తన ప్రియురాలు అనుష్క తనని మోసం చేసిందని తనలో తాను కుమిలిపోయాడు. మరో అబ్బాయితో చనువుగా ఉంటూ తనను పట్టించుకోవటం లేదని మనస్థాపానికి గురయ్యాడు. ప్రియురాలు చేసిన మోసాన్ని భరించలేక ఇమ్రోస్ పటేల్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Show comments