Bhatti Vikramarka Brother Passed Away: డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం

Bhatti Vikramarka: డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్ను మూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భట్టి హుటాహుటినా వైరాకు బయలర్దేరారు. ఇక మల్లు వెంకటేశ్వర్లు గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు గచ్చిబైలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

హోమియో ఎండి చదివిన మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే.. మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లుకి గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందారు.

మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా వైరాలోని తన ఇంట్లో హోమియో ఆసుపత్రి నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయన వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని నిర్వహించారు మల్లు వెంకటేశ్వర్లు. ఆయన హస్తవాసి ఎంతో మంచిదని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నమ్ముతారు.

మల్లు వెంకటేశ్వర్లు మృతి నేపథ్యంలో.. వారి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మల్లు కుటుంబీకులు హాజరుకానున్నారు. మల్లు వెంకటేశ్వర్లు మరణవార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show comments