ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీలు మృతి

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక రాజస్తాన్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు వలసకూలీలు నడకన బయలుదేరారు. మధ్యలో ఓ ట్రక్కు డ్రైవర్‌ వీరికి సహాయం చేశారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు ఉత్తరప్రదేశ్‌ ఔరాయ జాతీయ రహదారిపై వేగంగా వెళుతు ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని పోలీసులు ఆస్పత్రులకు తరలించారు.

Show comments