Upasana:ఉపాసన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ డ్రస్ ఎన్ని లక్షలో తెలుసా?

Upasana:ఉపాసన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ డ్రస్ ఎన్ని లక్షలో తెలుసా?

సాధారణంగా సెలబ్రిటీస్ వేసుకునే దుస్తులు బ్రాండెడ్ ఉంటాయని.. అవి కాస్టలీ ఉంటాయని కూడా అందరికి తెలిసిన విషయమే.. అయితే తాజాగా రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన క్రిస్టమస్ ఈవెంట్ లో వేసుకున్న దుస్తుల ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.

సాధారణంగా సెలబ్రిటీస్ వేసుకునే దుస్తులు బ్రాండెడ్ ఉంటాయని.. అవి కాస్టలీ ఉంటాయని కూడా అందరికి తెలిసిన విషయమే.. అయితే తాజాగా రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన క్రిస్టమస్ ఈవెంట్ లో వేసుకున్న దుస్తుల ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.

సహజంగా అభిమానులు తమ ఫేవరేట్ తారలను ఫాలో అవుతూ ఉంటారు. వారు ధరించిన దుస్తులలో, వారు ఉన్న స్టైల్ లో తాము కూడా ఉండాలని భావిస్తుంటారు. అయితే, సెలబ్రిటీస్ ధరించే దుస్తులు చాలా కాస్టలీ ఉంటాయి. ఇది అందరికి తెల్సిన విషయమే. కొంతమంది అప్పుడప్పుడు స్టార్ సెలబ్రిటీస్ వేసుకున్న దుస్తుల కాస్ట్ ను ఆన్ లైన్ లో చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాటి ప్రైస్ తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. అయితే, ఇప్పుడు తాజాగా ఇదే విషయంలో రామ్ చరణ్ భార్య ఇటీవల జరిగిన క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ లో.. వేసుకున్న దుస్తుల కాస్ట్ గురించి ఆరా తీసిన నెటిజన్లు ఔరా.. అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.

తాజాగా జరిగిన క్రిస్టమస్ ఈవెంట్ ను.. సెలెబ్రిటీలంతా చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా వారి సామజిక మాధ్యమాలలో పోస్ట్స్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వేడుకలో స్టార్ సెలెబ్రిటీలు అందరూ ప్రత్యేక్షమయ్యారు. వారితో పాటు వారి సతీమణులు కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు.
ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. ఇలా అందరూ కలిసి సరదాగా సమయాన్ని గడిపారు. ఈ వేడుకను హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే, ముఖ్యంగా ఈ వేడుకలో ఇటీవల మెగా ఫ్యామిలీకి శుభవార్తను ఇచ్చిన రామ్ చరణ్, ఉపాసనల జంట.. తమ బిడ్డతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఫోటోలు వైరల్ అయిన మాట నిజమే కానీ, అది ఆ జంట కోసం కాదు. ఆ పిక్చర్స్ లో ఉపాసన ధరించిన దుస్తుల గురించి. ఉపాసన తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలలో.. నెటిజన్ల కన్ను ఆమె దుస్తులపై పడింది. రెడ్ ఫ్రాక్ లో ఉపాసన అందరి దృష్టి ఆకర్షించింది. దీనితో నెటిజన్లు ఆమె వేసుకున్న దుస్తులను ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ దుస్తుల ధరను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఎందుకంటే వాటి ధర అక్షరాలా రూ. 3 లక్షల రూపాయలు. పైగా ఈ దుస్తులు టాప్ లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించినవి. దీనితో నెటిజన్లు ఉపాసన ఫోటోను, ఆన్ లైన్ లో ఆ దుస్తుల ఫోటోను పక్కపక్కన పెట్టి.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. ఇది చూసిన మిగిలిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉపాసన దుస్తుల ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ ఫోటోలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments