Anshu Saggar: మన్మధుడు మూవీ ఫేమ్ అన్షు రీ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో చిత్రంతో !

Anshu Saggar: మన్మధుడు మూవీ ఫేమ్ అన్షు రీ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరో చిత్రంతో !

ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ను అందించారు. కానీ అనేక కారణాల వలన వారంతా కూడా ఇండస్ట్రీకి దూరం అయిపోతూ ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే... ఇంకా ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లే.

ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ను అందించారు. కానీ అనేక కారణాల వలన వారంతా కూడా ఇండస్ట్రీకి దూరం అయిపోతూ ఉన్నారు. మరి అలాంటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే... ఇంకా ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లే.

ఇండస్ట్రీకి ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు.. వారిలో చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది హీరోయిన్స్ ఉండేవారు. అప్పట్లో వారికి ఉండే ఫ్యాన్ బేస్ కూడా అలానే ఉండేది. ఇక ఇప్పుడిప్పుడు అలనాటి హీరోయిన్స్ అంతా కూడా ఒక్కక్కరు ఇంటర్వూస్ ద్వారా బయటకు వస్తున్నారు. దీనితో మళ్ళీ సోషల్ మీడియాలో వారి గురించి సెర్చింగ్ స్టార్ట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. అన్షు సాగర్. ఈ మధ్య కాలంలో ఒకానొక ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. త్వరలోనే సరికొత్త సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అన్షు సాగర్ అనే కంటే మన్మధుడు లో హీరోయిన్ అని చెప్తే అందరు ఇట్టే గుర్తుపట్టేస్తారు ఈ బ్యూటీని. ఎందుకంటే మన్మధుడు సినిమా ఈ అమ్మడుకు మంచి పేరు తెచ్చిపెట్టింది, తన కెరీర్ మొత్తంలో చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా.. ఈమెను మాత్రం తెలుగు ఆడియన్స్ అంతా కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. ప్రభాస్, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు.. అప్పట్లో ఎంతో మంది కుర్రకారు హృదయాలను దోచేసింది. ఇప్పటికే ఈ హీరోయిన్ అంటే అంతే అభిమానం చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా.. దర్శకుడు త్రినాధ్ రావు ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అన్షు సాగర్ నటించబోతుందని.. టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ నేరేషన్ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు కనుక నిజమైతే.. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఈ నటి కమ్ బ్యాక్ ఇస్తుందని చెప్పి తీరాలి. ఇండస్ట్రీ లో ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన హిస్టరీ లేదు. ఇక ఇటీవల మన్మధుడు సినిమా థియేటర్ లో రిలీజ్ చేసిన తర్వాత.. థియేటర్ లో ఈ సినిమాకు అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ఇప్పుడు అంత కంటే ఎక్కువ రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక ఇప్పుడు అన్షు సాగర్ కమ్ బ్యాక్ ఇస్తే కనుక.. తన కెరీర్ మళ్ళీ మొదలైనట్లే అని చెప్పి తీరాలి. సినిమాలకు దూరం అయినా కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అందరికి దగ్గరగానే ఉంటుంది ఈ అమ్మడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments