వీడియో: కొడుక్కి తండ్రి రాసిన మరణశాసనం.. ఏం జరిగిందంటే!

వీడియో: కొడుక్కి తండ్రి రాసిన మరణశాసనం.. ఏం జరిగిందంటే!

తండ్రి అంటే కనిపించే దైవం. తన భుజంపై బిడ్డను ఎక్కించుకుని.. ఆ నొప్పిని భరిస్తూనే ప్రపంచాన్ని చూపిస్తూడు. ఇలా ప్రతి బిడ్డ విషయంలోనూ ప్రతి తండ్రీ చూపే ప్రేమ ఇది. కానీ హృదయం లేని ఓ కసాయి తండ్రి మాత్రం తన కుమారుడి మరణ శాసనం రాశాడు

తండ్రి అంటే కనిపించే దైవం. తన భుజంపై బిడ్డను ఎక్కించుకుని.. ఆ నొప్పిని భరిస్తూనే ప్రపంచాన్ని చూపిస్తూడు. ఇలా ప్రతి బిడ్డ విషయంలోనూ ప్రతి తండ్రీ చూపే ప్రేమ ఇది. కానీ హృదయం లేని ఓ కసాయి తండ్రి మాత్రం తన కుమారుడి మరణ శాసనం రాశాడు

సాధారణంగా తల్లిదండ్రులకు తమ బిడ్డలపై అంతులేని ప్రేమ ఉంటుంది. ఇది ప్రపంచంలో ఏ జీవిలైనాన కనిపించే లక్షణం. ఇక బిడ్డల కోసం కన్నవారు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. తాము కష్టపడుతూ పిల్లలను సంతోషంగా ఉంచుతుంటారు.  వారికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లపై క్రూరత్వం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ తండ్రి కూడా కుమారుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అంతేకాక ఆ కుమారుడికి.. తండ్రే మరణ శాసనం రాశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఈ ప్రపంచంలో తల్లి చూపే ప్రేమకు మించి విలువైనది మరొకటి లేదు. స్వార్థం లేని ప్రేమ అమ్మది. అలాంటి తల్లి..తన బిడ్డకు ఏదైన జరిగితే.. అల్లాడిపోతుంది. అలానే ఓ తల్లి కూడా తన భర్త కారణంగా కొడుకు మరణించిన తీరును చూసి గుండెలు పగిలేలా రోధించింది. అభం.. శుభం తెలియని.. ఓ చిన్నారిని కసాయి తండ్రి పొట్టనపెట్టుకున్నాడు . ఆరేళ్ల వయసులోనే కొడుకు లావుగా ఉన్నాడని, బరువు తగ్గించాలనే అనుకున్నాడు. ఈక్రమంలో జిమ్ అంటే అర్థం తెలియని ఆ చిన్నారి చేత… ఏకంగా ఆ వ్యాయమాలు చేయించాలని భావించాడు.  అలా ఆ ఆరేళ్ల  బాలుడిని జిమ్‌కు తీసుకెళ్లి విపరీతంగా వ్యాయామం చేయించాడు.

ట్రెడ్ మిల్ పై పరిగెత్తించాడు. ఇక ఆ చిన్నారి బాలుడు చేయలేక కింద పడిపోతున్నాడు. ఆ బుడ్డోడి బాధను అర్థం చేసుకోని ఆ తండ్రి తిరిగి లేపి మరీ స్పీడ్ గా పరిగెత్తించాడు. అంతేకాక.. ఇక రన్నింగ్ ను తట్టుకోలేక.. ఆ పసిగుండె ఒత్తిడికి గురై.. ఆగిపోయింది. ఈ దారుణ ఘటన 2021, మార్చిలో అట్లాంటిక్ హైట్స్ క్లబ్ హౌస్ ఫిటినెస్ సెంటర్‌లో జరిగింది. అయితే దానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన కోర్టు విచారణలో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు.

అమెరికాలోని న్యూజెర్సీలోని ఓప్రాంతంలో ఆరేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆ బాలుడి తండ్రి పేరు క్రిష్టోపర్. ఆయన తన కుమారుడి చేత బలవంతంగా ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. ఇక ఎక్కువ సేపు పరిగెత్త లేక చాలా సార్లు కిందపడిపోయాడు. అయినా కూడా ఆ తండ్రి తీవ్ర ఒత్తిడి చేసి పరుగెత్తించాడు. తీవ్రమైన గుండెపోటు, కాలేయం దెబ్బతినడంతో ప్రాణాలు వదిలాడు. తాజాగా కేసును న్యూజెర్సీ ఓషన్ సిటీలోని సుపీరియల్ కోర్టులో వీడియో ప్లే చేశారు. ఈ వీడియోను చూసిన కన్నతల్లి కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments