రోజుకు 200 పెట్టుబడి పెడితే చాలు.. చేతికి ఏకంగా 1,46,000.. ఎలా అంటే?

రోజుకు 200 పెట్టుబడి పెడితే చాలు.. చేతికి ఏకంగా 1,46,000.. ఎలా అంటే?

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడిని అందుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే?

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడిని అందుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే?

చాలామంది తమ వద్ద ఉన్న డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు అందుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం రియల్ ఎస్టేట్ బిజినెస్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అయితే పెట్టుబడి పెట్టి లాభాలు పొందేందుకు ఇవి మంచి మార్గాలే కానీ.. రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాభాలు దేవుడెరుగు ఉన్న సొమ్ము పోయే అవకాశం ఉంటుంది. మరి పెట్టుబడి ఎక్కడ పెడితే రిస్క్ లేకుండా మంచి రాబడి వస్తుందనుకుంటున్నారా? ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో నడిచే పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. పోస్టాఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ పొందొచ్చు. ఎలా అంటే?

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశమే లేదు. ఈ స్కీమ్ లో రోజుకు 200 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం 1,46,000 చేతికి అందుతాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా 3 కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకాన్ని రూ.1000 కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 9.5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తంపై 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.5000 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత రూ.10,000 పొందుతారు. అదే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10 లక్షలు పొందొచ్చు. ఇన్వెస్టర్లు ఈ పథకంలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీంలో ఎవరైనా రోజుకు రూ.200 చొప్పున అంటే నెలకు 6000 సంవత్సరం పాటూ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సొమ్ము మొత్తం ఏడాదికి 72000 అవుతుంది. ఈ పెట్టుబడిపై పదేళ్ల లోపే డబుల్ రాబడిని పొందుతారు. 7.5 వడ్డీరేటుతో మొత్తం రూ.1,46,000 పొందుతారు. ఈ స్కీమ్‌ లో మీరు పెట్టిన డబ్బు డబుల్ అయ్యే గడువు కాలం 115 నెలలు పడుతుంది.

Show comments